For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Shahid Hakeem: భారత ఫుట్‌బాల్ దిగ్గజం కన్నుమూత

 Former Indian footballer and Olympian Shahid Hakeem passes away at 82

కర్ణాటక: భారత ఫుట్‌బాల్‌ దిగ్గజం షాహిద్‌ హకీమ్‌(82) గుండెపోటుతో కన్ను మూశారు. గుల్బర్గాలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆయన తుదిశ్వాస విడిచారు. షాహిద్‌ హకీమ్‌కు భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. హకీమ్​ సాబ్​గా గుర్తింపు పొందిన ఆయన.. భారత ఫుట్​బాల్​కు ఐదు దశాబ్దాల పాటు సేవలు అందించారు. 1950-1960 మధ్య భారత్‌ తరఫున హకీమ్‌ ఫుట్‌ బాల్‌ మ్యచ్‌లో ఆడారు. 1960 రోమ్‌ ఒలింపిక్స్‌లో భారత్‌ తరఫున షాహిద్‌ హకీమ్ ప్రాతినిధ్యం వహించారు. ఫిఫా మ్యాచ్‌లకు అంతర్జాతీయ రిఫరీగా కూడా వ్యవహరించారు.

వాయుసేనలో స్క్వాడ్రాన్​ లీడర్​గా బాధ్యతలు నిర్వర్తించిన హకీమ్.. 1960 రోమ్​ ఒలింపిక్స్​లో తొలిసారి భారత ఫుట్​బాల్​ జట్టుకు ప్రాతినిధ్యం వహించారు. ఆ సమయంలో జట్టు కోచ్​గా ఆయన తండ్రి సయిద్​ అబ్దుల్​ రహీమ్​ ఉన్నారు. అయితే హకీమ్​ జట్టులో ఉన్నా.. ఆ సమయంలో ఆడే అవకాశం రాలేదు. దేశీయ ఫుట్​బాల్​ టోర్నీల్లో కోచ్​గా ​హకీమ్​ కీలక పాత్ర పోషించారు. హకీమ్​ సేవలను గుర్తించిన ప్రభుత్వం ధ్యాన్​చంద్​ అవార్డు, ద్రోణాచార్య అవార్డులతో గౌరవించింది. హకీమ్​ మృతి పట్ల ఏఐఎఫ్​ఎఫ్​ (ఆల్​ ఇండియా ఫుట్​బాల్​ ఫెడరేషన్​) అధ్యక్షుడు ప్రఫుల్​ పటేల్​ సంతాపం వ్యక్తం చేశారు. దేశంలో ఫుట్​బాల్​కు ఆదరణ పెరగడంలో హకీమ్​ కృషి మరువలేనిది అని ఆయన పేర్కొన్నారు.

Story first published: Sunday, August 22, 2021, 20:33 [IST]
Other articles published on Aug 22, 2021
-
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+