
విమానం నుంచి మొదట మెస్సి ఆ తర్వాత కోచ్ స్కాలోని, ఆటగాళ్లు బయటకు వచ్చారు. వారి రాకతో నినాదాలతో ఆ ప్రాంతం హోరెత్తిపోయింది. ఒకవైపు తమ జట్టును కీర్తిస్తూ రాక్బ్యాండ్ పాటలు, మరోవైపు 'థాంక్యూ ఛాంపియన్స్' అనే ప్లకార్డులతో విమానాశ్రయంలో ఎటు చూసినా అర్జెంటీనా జపమే. ఆ తర్వాత అభిమానులు అడుగడుగునా నీరాజనాలు పడుతుండగా ఓపెన్ టాప్ బస్సులో మెస్సి బృందం కూడా రాక్బ్యాండ్తో శ్రుతి కలిపి తమ దేశ ఫుట్బాల్ సంఘం ప్రధాన కేంద్రానికి వెళ్లింది. అర్జెంటీనా అధ్యక్షుడు అల్బెర్టో ఫెర్నాండెజ్ మంగళవారం జాతీయ సెలవుగా ప్రకటించడంతో అభిమానుల తాకిడి మరింత పెరిగింది. ఎటు చూసిన ఇసుక వేస్తే రాలనంత జనం రావడంతో పరిస్థితి అదుపు తప్పింది.
కొందరు అభిమానులు హద్దులు ధాటి మెస్సీ బృందం ప్రయాణిస్తున్న ఓపెన్ టాప్ బస్సులోకి దూకే ప్రయత్నం చేశారు. ఒకరు ఆటగాళ్ల మధ్యలోకి దూకినా.. మరొకరు కింద పడి తీవ్రంగా గాయపడ్డాడు. దాంతో ఆటగాళ్ల క్షేమం కోసం అర్జెంటీనా ప్రభుత్వం జైత్రయాత్రను రద్దు చేసి హెలీకాప్టర్ ద్వారా ఆటగాళ్లను అభిమానుల మధ్య నుంచి తీసుకెళ్లింది. ఆదివారం జరిగిన ఫైనల్లో అర్జెంటీనా 4-2(షూటౌట్)తో ఫ్రాన్స్ను ఓడించి విశ్వవిజేతగా నిలిచి విషయం తెలిసిందే.