విండీస్పై అరంగేట్రం..
2011 జూన్ 20న వెస్టిండీస్తో జరిగిన మ్యాచ్తో టెస్టు అరంగేట్రం చేసిన కోహ్లీ.. ఆ తర్వాత కాలంలో ప్లేయర్గా, కెప్టెన్గా అత్యున్నత శిఖరాల్ని అధిరోహించాడు. ఈ ఫార్మాట్లో ఎక్కువ పరుగులు చేసిన భారత్ ఆరో బ్యాట్స్మన్గా కొనసాగుతున్నాడు. టెస్టుల్లోకి ఎంట్రీ ఇచ్చిన అరంగేట్రం సిరీస్లో వెస్టిండీస్తో నాలుగో టెస్టులో, నాలుగో స్థానంలో బ్యాటింగ్కు దిగి వరుసగా రెండు అర్ధసెంచరీలు చేశాడు. తర్వాత ఆస్ట్రేలియాపై తన తొలి సెంచరీ చేశాడు. ఇది విరాట్కు ఎనిమిదో టెస్టు. ఈ మ్యాచ్లో టీమ్ఇండియా ఓడిపోయినప్పటికీ, విరాట్ బ్యాటింగ్పై ప్రశంసలు వచ్చాయి.
ఆరో బ్యాట్స్మన్గా..
7500కు పైగా పరుగులు చేసిన విరాట్.. ఈ ఫార్మాట్లో ఎక్కువ రన్స్ కొట్టిన భారత్ బ్యాట్స్మెన్లో 6వ క్రికెటర్గా గుర్తింపు పొందాడు. కెప్టెన్గానూ 5,392 పరుగులు చేశాడు. 58 సగటుతో 20 సెంచరీలు ఇందులో ఉన్నాయి. టెస్టుల్లో అత్యధికంగా శతకాలు కొట్టిన వారిలో కోహ్లీ నాలుగో స్థానంలో ఉన్నాడు. సచిన్(51), రాహుల్ ద్రవిడ్(36) సునీల్ గవాస్కర్(34).. విరాట్ కంటే ముందున్నారు. ఇప్పటివరకు ఈ ఫార్మాట్లో 7 డబుల్ సెంచరీలు బాదిన విరాట్.. ఈ జాబితాలో టీమ్ఇండియా బ్యాట్స్మెన్ తరఫున అగ్రస్థానంలో ఉన్నాడు.
అత్యధిక రన్స్..
ఓ క్యాలెండర్ ఏడాదిలో ఎక్కువ పరుగులు చేసిన రికార్డు కూడా కోహ్లీ పేరిటే ఉంది. 2016లో 1215, 2018లో 1322 పరుగులు సాధించాడు. టెస్టు క్రికెట్లో కోహ్లీ అత్యంత విజయవంతమైన భారత కెప్టెన్. 60 మ్యాచ్ల్లో 34 మ్యాచ్ల్లో గెలిచి, 59.01 విజయాల శాతంతో కొనసాగుతున్నాడు. ఇతడి కంటే ముందు రికీ పాంటింగ్(62.33) మాత్రమే ఉన్నాడు. ఎక్కువగా టాస్ ఓడిపోయే కోహ్లీ.. సౌతాఫ్రికా(2016-17, 2019-20), శ్రీలంక(2017), న్యూజిలాండ్(2016-17) టెస్టు సిరీస్ల్లో మాత్రం అన్నింటిలో టాస్ గెలవడం విశేషం.
ఐసీసీ టీ20 ప్రపంచకప్, టెస్టు ఛాంపియన్షిప్, వరల్డ్కప్, ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో ఆడిన ఏకైక క్రికెటర్ విరాట్ కోహ్లీ.
హాఫ్ సెంచరీకి చేరువలో..
న్యూజిలాండ్తో జరుగుతున్న వరల్డ్ టెస్టు చాంపియన్షిప్ (డబ్ల్యూటీసీ) ఫైనల్లో కోహ్లీ నిలకడగా రాణిస్తున్నాడు. బ్యాటింగ్కు ప్రతికూలంగా మారిన పిచ్కు కింగ్లా స్వింగ్ను ఎదుర్కొంటున్నాడు. హాఫ్ సెంచరీ దిశగా దూసుకెళ్తున్నాడు. దాంతో తొలి రోజు ఆట ముగిసి సమయానికి భారత్ తమ తొలి ఇన్నింగ్స్లో 3 వికెట్ల నష్టానికి 146 పరుగులు చేసింది. క్రీజులో కెప్టెన్ విరాట్ కోహ్లీ (124 బంతుల్లో 1 ఫోర్తో 44 బ్యాటింగ్), అజింక్యా రహానే (79 బంతుల్లో 4 ఫోర్లతో 29 బ్యాటింగ్) ఉన్నారు. చతేశ్వర్ పుజారా(8) విఫలమైనా.. రోహిత్ (34), గిల్ (28) ఆకట్టుకున్నారు.