రోహిత్ శర్మ సెంచరీ
ఈ మ్యాచ్లో సెంచరీ సాధించిన రోహిత్ శర్మకు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది. ఈ విజయంతో టీమిండియా 13 పాయింట్లతో రెండో స్థానానికి ఎగబాకింది. ఈ మెగా టోర్నీలో టీమిండియాకు ఇంకో మ్యాచ్ మిగులుంది. ఈ ప్రపంచకప్ రౌండ్ రాబిన్ పద్ధతిలో జరుగుతున్న నేపథ్యంలో పాయింట్ల పట్టికలో 1, 4 స్థానాల్లో ఉన్న జట్లు తొలి సెమీస్ ఆడగా.. 2, 3 స్థానాల్లో ఉన్న జట్లు రెండో సెమీస్ ఆడతాయి.
టీమిండియా సెమీస్ ప్రత్యర్థి ఎవరు?
ఈ నేపథ్యంలో టీమిండియా సెమీస్ ప్రత్యర్థి ఎవరన్నదే తేలాల్సి ఉంది. 14 పాయింట్లతో పట్టికలో ఆస్ట్రేలియా అగ్రస్థానంలో ఉంది. జులై 6న ఆసీస్ తన చివరి మ్యాచ్ని దక్షిణాఫ్రికాతో ఆడనుంది. ఈ మ్యాచ్లో ఆసీస్ విజయం సాధిస్తే 16 పాయింట్లతో తన అగ్రస్థానాన్ని మరింత పదిలం చేసుకుంటుంది.
శ్రీలంకపై టీమిండియా గెలిస్తే
మరోవైపు టీమిండియా కూడా అదే రోజున శ్రీలంకతో తలపడనుంది. ఈ మ్యాచ్లో టీమిండియా గెలిస్తే 15 పాయింట్లతో రెండో స్థానంలోనే ఉంటుంది. దీంతో ఒకటి, రెండు స్థానాల్లో ఆస్ట్రేలియా, టీమిండియాకు ఫిక్స్ అయ్యాయి. బుధవారం టోర్నీలో భాగంగా న్యూజిలాండ్-ఇంగ్లాండ్ జట్ల మధ్య మ్యాచ్ జరగనుంది.
సెమీస్లో భారత్-ఆస్ట్రేలియా జట్లు తలపడవు
ఈ మ్యాచ్లో న్యూజిలాండ్పై ఇంగ్లాండ్ విజయం సాధిస్తే మూడో స్థానంలో నిలిచి సెమీస్లో టీమిండియాతో తలపడనుంది. అలా కాకుండా ఈ మ్యాచ్లో న్యూజిలాండ్ విజయం సాధిస్తే టీమిండియా ప్రత్యర్ధి న్యూజిలాండ్ అవుతుంది. మరోవైపు దక్షిణాఫ్రికా చేతిలో ఆసీస్ ఓడి, శ్రీలంకను ఓడించి భారత్ అగ్రస్థానానికి చేరితే.. న్యూజిలాండ్ లేదా ఇంగ్లాండ్ లేదా పాకిస్థాన్లతో టీమిండియా తలపడాల్సి ఉంటుంది. ఏది ఏమైనా ఈ ప్రపంచకప్ సెమీస్లో భారత్-ఆస్ట్రేలియా జట్లు తలపడవు.