ఓపెనర్గా ప్రమోట్ అవ్వడంతో..
మరీ ముఖ్యంగా పాకిస్థాన్పై చెడుగుడు ఆడేవాడు.అది వన్డేనా..? టెస్ట్ మ్యాచ్ ఆడుతున్నామా అనే తేడా లేకుండా బౌలర్లపై విరుచుకుపడేవాడు. అలా టెస్టుల్లో రెండు ట్రిపుల్ సెంచరీలను నమోదు చేసిన సెహ్వాగ్ భారత తరఫున హయ్యెస్ట్ స్కోర్ చేసిన ప్లేయర్గా రికార్డుకెక్కాడు. అయితే కెరీర్ ఆరంభంలో మిడిలార్డర్లో ఆడిన సెహ్వాగ్.. ఓపెనర్గా ప్రమోట్ అవ్వడంతో సక్సెస్ సాధించాడు. అయితే అతన్ని ఓపెనింగ్ పంపించాలని ఐడియా ఇచ్చిన ఆటగాడు ఎవరు? అని పాక్ మాజీ పేసర్ షోయబ్ అక్తర్ ప్రశ్నించగా సెహ్వాగ్ బదులిచ్చాడు.
గంగూలే అని..
ఇప్పటి వరకు చాలామంది అభిమానులు టీమిండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీనే సెహ్వాగ్ను ఓపెనర్గా పంపించాడని భావిస్తారు. అయితే.. గంగూలీ నాయకత్వంలోనే సెహ్వాగ్ ఓపెనర్గా వచ్చాడు. కానీ, తన పేరును మరొక కీలక ప్లేయర్ సూచించాడని తాజాగా సెహ్వాగ్ పేర్కొన్నాడు. ఓ క్రీడా ఛానల్లో పాక్ మాజీ పేసర్ షోయబ్ అక్తర్తో సెహ్వాగ్ ప్రత్యేక చిట్చాట్ నిర్వహించాడు. ఈ సందర్భంగా సెహ్వాగ్ను అక్తర్''నిన్ను ఓపెనింగ్కు పంపించాలనేది ఎవరి ఐడియా?''.. ప్రశ్నించాడు.
జహీర్ సలహాతో..
దీనికి సమాధానంగా 'ఇన్నింగ్స్ను ప్రారంభించే స్థానంలో నన్ను దింపాలనేది అప్పటి టీమిండియా పేసర్ జహీర్ ఖాన్ ఐడియా. ఇదే విషయాన్ని కెప్టెన్గా ఉన్న సౌరవ్ గంగూలీకి చెప్పాడు. నేను అప్పటి వరకూ మిడిలార్డర్లోనే ఆడేవాడిని. అంతేకాకుండా తొలిసారి నిన్ను (షోయబ్) 1999లో మిడిలార్డర్ బ్యాటర్గానే ఎదుర్కొన్నా'' అని సెహ్వాగ్ వివరించాడు. ఇప్పుడు తెలిసింది కదా.. సెహ్వాగ్ వీరవిహారం వెనుక ఉన్న మాస్టర్ మైండ్.