అన్ని గెలవాల్సిందే..?
ఈ క్రమంలోనే ఈ సారైనా ఆ టైటిల్ను ముద్దాడాలనే పట్టుదలతో ఉంది. కానీ సౌతాఫ్రికా పర్యటనలో ఎదురైన ఓటమి టీమిండియా ఫైనల్ చేరే అవకాశాలను సంక్లిష్టం చేసింది. టీమిండియా టైటిల్ ఫైట్కు అర్హత సాధించాలంటే అప్కమింగ్ మ్యాచ్ల్లో విజయం సాధించాలి. ఇంగ్లండ్తో జూలై 1న ప్రారంభం కానున్న ఏకైక టెస్ట్తో పాటు బంగ్లాదేశ్ పర్యటనలో విజయం సాధించాలి. అంతేకాకుండా భారత పర్యటనకు వచ్చే ఆస్ట్రేలియాను మట్టికరిపించాలి.
ఆస్ట్రేలియాను ఓడించాలి..
ఇంగ్లండ్తో ఏకైక టెస్ట్ గెలవడం వల్ల భారత్ విజయాల శాతం మెరుగవుతోంది. ఆ తర్వాత బంగ్లాదేశ్ గడ్డపై జరిగే రెండు టెస్ట్లు, ఆస్ట్రేలియాతో సొంతగడ్డపై నాలుగు టెస్ట్లు గెలవాలి. కనీసం 3-1తోనైనా ఆస్ట్రేలియాను ఓడిస్తే ఆ జట్టు అగ్రస్తానం చేజారుతుంది. ఇక ఆస్ట్రేలియా అఫ్గానిస్థాన్తో ఏకైక టెస్ట్తో పాటు వెస్టిండీస్తో రెండు టెస్ట్లు ఆడనుంది. సౌతాఫ్రికాతో కూడా ఆసీస్ మూడు టెస్ట్లు ఆడనుండగా ఆ జట్టు భవితవ్యం ఈ సిరీస్తో తేలనుంది. ఇంగ్లండ్తో పాటు వెస్టిండీస్తో కూడా సౌతాఫ్రికా రెండేసి మ్యాచ్లు ఆడనుంది. ఇక ఇంగ్లండ్, న్యూజిలాండ్ జట్లు వరుస ఓటములతో తమ ఫైనల్ అవకాశాలను దెబ్బతీసుకున్నాయి.
కచ్చితంగా గెలవాలి..
ఆస్ట్రేలియా చేతిలో ఓడితే ఇతర జట్ల ఫలితాలపై ఆధారపడాల్సిన పరిస్థితి వస్తుంది. భారత్ ఓడటం వల్ల రెండో స్థానంలో ఉన్న సౌతాఫ్రికాకు మార్గం సుగుమమవుతోంది. ఏ రిస్క్ లేకుండా ఫైనల్ బెర్త్ ఖాయం చేసుకోవాలంటే అప్కమింగ్ సిరీస్లో ప్రతీ మ్యాచ్ గెలవాలి. గతేడాది ఇంగ్లండ్తో ఐదు టెస్ట్ల సిరీస్లో భాగంగా నాలుగు మ్యాచ్లు ముగిసిన అనంతరం కరోనా కలకలం రేగడంతో ఆఖరి మ్యాచ్ నిరవధికంగా వాయిదా పడింది. ఇప్పుడు ఆ మ్యాచే.. జూలై 1 నుంచి బర్మింగ్హామ్ వేదికగా జరగనుంది. ఈ సిరీస్లో ఇప్పటికే భారత్ 2-1తో ఆధిక్యంలో ఉంది. ఈ పరిస్థితుల్లో ఆఖరి మ్యాచ్ గెలిచినా.. కనీసం డ్రా చేసుకున్నా భారత్దే సిరీస్ అవుతోంది.