తొలి మ్యాచ్ ఇందిరా ప్రియదర్శిని మున్సిపల్ స్టేడియంలో
భారత్-విండీస్ జట్ల మధ్య విశాఖలో తొలి మ్యాచ్ పాతనగరం ఇందిరా ప్రియదర్శిని మున్సిపల్ స్టేడియంలో 1994 డిసెంబరు 7న జరిగింది. ఆ మ్యాచ్లో భారత్ గెలుపొందింది. అప్పటికి కోహ్లీ భారత జట్టులోకి రాలేదు. 2011లో విండీస్ జట్టు రెండోసారి వై.ఎస్.ఆర్. ఏసీఏ-వీడీసీఏ స్టేడియంలో ఆడేందుకు వచ్చింది.
కోహ్లీ చెలరేగి ఆడి 117 పరుగులు
ఆ మ్యాచ్లో విరాట్ కోహ్లీ చెలరేగి ఆడి 117 పరుగులు చేశాడు. ఈ మ్యాచ్లో భారత జట్టు 5 వికెట్ల తేడాతో గెలుపొందింది. ఇదే స్టేడియంలో 2010 అక్టోబరు 20న జరిగిన మరో మ్యాచ్లో ఆస్ట్రేలియాపై కోహ్లీ 118 పరుగులు చేసి సత్తా చాటాడు. ఈ మ్యాచ్లో భారత్ జట్టు 5 వికెట్ల తేడాతో గెలుపొందింది. 2013లో ఇదే వెస్టిండీస్పై కోహ్లీ సెంచరీకి ఒక్క పరుగు తేడాతో అవుట్ అయి 99పరుగులు చేశాడు.
కోహ్లీకి అచ్చొచ్చిన మైదానం.. విశాఖ స్టేడియం
2016 అక్టోబరు 29న భారత్- న్యూజిలాండ్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్లో కోహ్లీ 65 పరుగులు చేశాడు. ఈ మ్యాచ్లో భారత జట్టు 190 పరుగుల భారీ తేడాతో గెలుపొందింది. ఇక బుధవారం జరుగుతోన్న మ్యాచ్లో 81 పరుగులు చేసి 10వేల పరుగుల క్లబ్లో చేరిపోయాడు. విశాఖ స్టేడియం కోహ్లీకి అచ్చొచ్చిన మైదానం. బుధవారం నాటి మ్యాచ్లో కూడా కోహ్లీ సెంచరీ కొడతాడనే అభిమానులు ఆశిస్తున్నారు.
డివిలియర్స్ రికార్డుని సైతం కోహ్లీ బద్దలు
సొంతగడ్డపై వన్డేల్లో అత్యంత వేగంగా 78 ఇన్నింగ్స్లలో 4000 పరుగుల మైలురాయిని అందుకున్న క్రికెటర్గా కోహ్లీ నిలిచాడు. కోహ్లీకి కంటే ముందు ఈ రికార్డుని క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్, మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనిలు అందుకున్నారు. ఈ రికార్డు చేరుకోవడానికి సచిన్కు 92 ఇన్నింగ్స్లు అవసరం కాగా, ధోనికి 100 ఇన్నింగ్స్లు అవసరమయ్యాయి. అదే సమయంలో దక్షిణాఫ్రికా మాజీ క్రికెటర్ ఏబీ డివిలియర్స్ రికార్డుని సైతం కోహ్లీ బద్దలు కొట్టాడు.