గంగూలీని కలిసి మాట్లాడిన మాటలు
తాజాగా ఓ ఇంటర్వ్యూలో రైనా దీని గురించి చెప్పుకొచ్చాడు. 'టీమిండియాకు దూరంగా గడిపిన క్షణాలు నాకెంతో క్లిష్టమైనవి. రంజీ సీజన్లో అనుకున్న రీతిలో రాణించలేకపోయా. ఆ తర్వాత సయ్యద్ ముస్తాక్ అలీ టోర్నీలో కోల్కతాలో బెంగాల్పై జరిగిన మ్యాచ్ నా భవిష్యత్తును మార్చింది.'
126 పరుగులతో నాటౌట్గా
'ఆ మ్యాచ్లో 126 పరుగులతో నాటౌట్గా నిలిచాను. అంతకుముందు ఇదే టోర్నీలో ఓ మ్యాచ్లో తొలి రెండు బంతుల్లోనే ఔటయ్యాను. ఆ తర్వాత బెంగాల్పై అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాను. ఈ ఇన్నింగ్స్ నా జట్టుకు ఎంతో ముఖ్యమైనది. ఈ మ్యాచ్ తర్వాత హర్భజన్ సింగ్... గంగూలీ ఇంటికి డిన్నర్కి వెళ్లాం. ఆ సమయంలో చాలా విషయాల గురించి చర్చించుకున్నాం. మధ్యలో.. 2006లో ఎలా అయితే జట్టులో స్థానం కోసం ఎంత కష్టపడ్డానో ఆ సందర్భంగా గంగూలీ గుర్తు చేశాడు.'
అప్పుడు అర్థం చేసుకున్నా
'మళ్లీ అదే పరిస్థితుల్లో ఉన్నానని అప్పుడు అర్థం చేసుకున్నా. ఇక అప్పటి నుంచి మరో ఆలోచన లేకుండా ఫిట్నెస్ సాధించడం, ఫామ్పై దృష్టి పెట్టా. ఆ సందర్భంగా గంగూలీతో మాట్లాడటం ఎంతగానో కలిసొచ్చింది' అని రైనా వివరించాడు.
ఐర్లాండ్, ఇంగ్లాండ్తో జరిగే టీ20 సిరీస్లకు
కొద్ది రోజుల తర్వాత యో యో టెస్టు పాసవ్వడంతో ఈ ఏడాది దక్షిణాఫ్రికాతో టీ20 సిరీస్ కోసం ఎంపిక చేసిన భారత జట్టులో చోటు దక్కించుకున్నాడు రైనా. ఆ తర్వాత శ్రీలంకతో టీ20 సిరీస్ ఆడాడు. తాజాగా వచ్చే నెలలో ఐర్లాండ్, ఇంగ్లాండ్తో జరిగే టీ20 సిరీస్లకు రైనాను బీసీసీఐ ఎంపిక చేసిన విషయం తెలిసిందే.