అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్న పంత్
రెండో వన్డేలో అయ్యర్ తనకు వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నాడని, NO.4 స్థానంలో రిషబ్ పంత్ కన్నా అయ్యరే సరిగ్గా సరిపోతాడని గవాస్కర్ చెప్పుకొచ్చాడు. సోనీ టెన్ 1తో సునీల్ గవాస్కర్ మాట్లాడుతూ "నా వ్యూ ప్రకారం... ధోనీ లాగే పంత్ కూడా ఐదు, ఆరు స్థానాల్లోనే మ్యాచ్ ఫినీషర్గా పనికొస్తాడని, ఆ స్థానాలే అతడి ఆటశైలికి సరిపోతాయి" అని చెప్పాడు.
విండీస్ దిగ్గజం లారా రికార్డులు బద్దలు కొట్టిన క్రిస్ గేల్
40-45 ఓవర్ల పాటు కొనసాగితే..
"విరాట్ కోహ్లీ, శిఖర్ ధావన్, రోహిత్ శర్మ 40-45 ఓవర్ల పాటు కొనసాగితే.. అప్పుడు రిషబ్ పంత్ నాలుగో స్థానంలో రావాలి. ఒకవేళ టాపార్డర్ 30-35 ఓవర్లలోపే ఔటైతే శ్రేయస్ అయ్యర్ No. 4 స్థానంలో వచ్చి, రిషబ్ పంత్ No. 5 స్థానంలో ముందు రావాలి" అని సునీల్ గవాస్కర్ తెలిపాడు.
కెప్టెన్ కోహ్లీతో కలిసి ఆడిన అయ్యర్
"అతడు శ్రేయస్ అయ్యర్ రెండో వన్డేలో అవకాశాన్ని అందిపుచ్చుకున్నాడు. No. 5 స్థానంలో క్రీజులోకి రావడంతో తగినన్ని ఓవర్లు లభించాయి. కెప్టెన్ విరాట్ కోహ్లీతో కలిసి అద్భుతంగా ఆడాడు. ప్రపంచశ్రేణి బ్యాట్స్మన్తో కలిసి ఆడేటప్పుడు నాన్స్ట్రైకింగ్ ఎండ్లో ఉండి చాలా విషయాలు నేర్చుకోవచ్చు" అని తెలిపాడు.
అయ్యర్ స్థానం సుస్థిరం అవ్వాలని
"ఈ ఇన్నింగ్స్ ద్వారా మిడిల్ ఆర్డర్లో శ్రేయస్ అయ్యర్ స్థానం సుస్థిరం అవ్వాలని, అలా కాకపోతే భవిష్యత్లో ఏం జరుగుతుందో ఊహించడం కష్టం. ఈ మ్యాచ్కి ముందు విండీస్ ఎ జట్టుతో అయ్యర్ అనధికార ఐదు వన్డేల సిరీస్లోనూ ఆడాడు. ఈ సిరిస్లో రెండు హాఫ్ సెంచరీలతో పాటు 88 పరుగుల అత్యధిక స్కోరు నమోదు చేశాడు" అని గవాస్కర్ మెచ్చుకున్నాడు.