పాంటింగ్ మాట్లాడుతూ
మంగళవారం గంగూలతో కలిసి మీడియా సమావేశంలో పాల్గొన్న పాంటింగ్ మాట్లాడుతూ "నాకు అవకాశమిస్తే మరో ఆలోచన లేకుండా పంత్కు భారత జట్టులో చోటు కల్పిస్తా. అతడిని ఒక బ్యాట్స్మన్గానే ఆడిస్తా. నాలుగో స్థానంలో దింపుతా. అలాంటి ప్రతిభావంతులు ప్రపంచకప్ అందించగలరు. టోర్నీలో అతను కీలకమవుతాడు" అని అన్నాడు.
పంత్ను నాలుగో స్థానంలో ఆడించాలి
మరోవైపు రిషబ్ పంత్ను నాలుగో స్థానంలో ఆడించాలన్న పాంటింగ్ ఆలోచనతో గంగూలీ సైతం ఏకీభవించాడు. మరోవైపు ఐపీఎల్ ప్రదర్శనను బట్టే వరల్డ్కప్ టీమ్ ఎంపిక ఉంటుందని బోర్డు ఉన్నతాధికారి ఒకరు స్పష్టం చేశారు. మే30న ప్రారంభమయ్యే వన్డే వరల్డ్కప్కు ఏప్రిల్ 20న సెలక్టర్లు 15మందితో కూడిన జట్టుని ఎంపిక చేసే అవకాశాలు ఉన్నాయి.
ఐపీఎల్ 2019 సీజన్ ఎంతో కీలకం
ఐపీఎల్ 2019 సీజన్ ఎంతో కీలకం కానుందని ఆ అధికారి తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ "ఐపీఎల్లో రాణించిన వాళ్లకు వరల్డ్కప్లో చోటు దక్కే అవకాశాలు ఉన్నాయి. నిజానికి ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్లోనే అన్ని స్థానాలకు ప్లేయర్స్ దొరుకుతారు అని భావించినా.. నాలుగో స్థానంలో మాత్రం మిస్టరీగానే మిగిలిపోయింది. ఆ స్థానంలో ఎవరూ రాణించలేదు" అని అన్నారు.
ఈ స్థానం కోసం నలుగురు పోటీ
"ప్రస్తుతానికి ఈ స్థానం కోసం నలుగురు పోటీ పడుతున్నారు. అజ్యింకె రహానే, అంబటి రాయుడు, శ్రేయాస్ అయ్యర్, కేఎల్ రాహుల్ NO.4 స్థానం రేసులో ఉన్నారు. వీళ్లంతా ఐపీఎల్లో ఎలా ప్రదర్శిస్తారనే దానిపై వరల్డ్కప్ జట్టు ఎంపిక ఆధారపడి ఉంటుంది. నాలుగో స్థానానికి ఇంకా ఏ ఆటగాడు కూడా అధికారికంగా ఖరారు కాలేదు. ఈ స్థానం కోసం ఇంకా పోటీ ఉంది" అని ఆయన తెలిపారు.