162 పరుగుల విజయ లక్ష్యంతో
న్యూజిలాండ్ నిర్దేశించిన 162 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన భారత మహిళల జట్టు 14.4 ఓవర్లు మిగిలుండగానే ఛేదించింది. ఈ సిరిస్లో బాగంగా తొలి వన్డేలో సెంచరీ సాధించిన భారత ఓపెనర్ స్మృతి మంధాన రెండో వన్డేలోనూ 90 పరుగులతో నాటౌట్గా నిలిచి జట్టు విజయంలో కీలకపాత్ర పోషించింది.
63 పరుగులతో నౌటౌట్గా
మరోవైపు కెప్టెన్ మిథాలీ రాజ్ సైతం 63 పరుగులతో నౌటౌట్గా నిలిచింది. ఓపెనర్ జెమీమా రోడ్రిగ్స్ డకౌట్ కాగా.. ఫస్ట్ డౌన్ బ్యాటర్ దీప్తి శర్మ(8) తీవ్రంగా నిరాశపర్చింది. దీంతో 15 పరుగులకే రెండు వికెట్లు పడిపోయిన దశలో క్రీజులోకి వచ్చిన మిథాలీ మరో మరో వికెట్ పడకుండా మ్యాచ్ను ముగించారు.
|
మూడో వికెట్కు 151 పరుగులు
మంధాన తనదైన శైలిలో విజృంభించి 54 బంతుల్లో 8 ఫోర్ల సాయంతో మంధాన కెరీర్లో 14వ హాఫ్ సెంచరీ పూర్తి చేసింది. అనంతరం మిథాలీ రాజ్ కూడా 102 బంతుల్లో 3 ఫోర్లు 1 సిక్స్ సాయంతో కెరీర్లో 52వ హాఫ్ సెంచరీ సాధించింది. వీరిద్దరూ మూడో వికెట్కు అజేయంగా 151 పరుగులు జోడించారు.
|
88 బంతులు మిగిలి ఉండగానే
దీంతో భారత్ 88 బంతులు మిగిలి ఉండగానే భారత్ విజయాన్ని అందుకుంది. అంతకుముందు తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ను భారత బౌలర్లు 161 పరుగులకే కుప్పకూల్చారు. పేసర్ జులన్ గోస్వామి మూడు వికెట్లు తీయగా.. ఏక్తా బిష్త్, పూనమ్ యాదవ్, దీప్తి శర్మ తలా రెండు వికెట్లు తీశారు.