కన్నీళ్లను ఆపాలని నేను ప్రయత్నించలేదు
"ఆ సమయంలో కన్నీళ్లను ఆపాలని నేను ప్రయత్నించలేదు. మగాళ్లయినా సరే కన్నీరు కారిస్తే తప్పేం కాదు. నిన్ను బలవంతుడిని చేసే ఒక భాగాన్ని ఎందుకు దాచుకోవాలి? కన్నీళ్లను ఎందుకు దాచాలి? ఏడుపు మగాళ్లను బలహీనులను చేస్తుందని విశ్వసించాం. ఇదే నిజమని వింటూ నేనూ పెరిగాను. అది తప్పని తెలుసుకున్నాను కాబట్టే ఈ లేఖ రాస్తున్నాను. నా పోరాటం, బాధలే నన్ను ఇంతటివాడిని చేశాయి" అని సచిన్ అన్నారు.
చాలా ధైర్యం అవసరం
"మన బాధను ప్రదర్శించేందుకు చాలా ధైర్యం అవసరం. ప్రతిరోజు తప్పకుండా ఉదయిస్తున్నట్టే కష్టాల నుంచి శక్తి మంతులవుతారు. అందుకే ఇలాంటి అపోహల నుంచి బయట పడండి. భావోద్వేగాలు బయట పెట్టేందుకు ధైర్యం చేయండి. నేనూ ఆందోళన, బాధలు, సందేహాలను ఎదుర్కొన్నాను. ఏడవడంలో తప్పులేదు. ఆ తర్వాత మనోధైర్యంతో ఉండాలి. ఎందుకంటే మగాళ్లు చేయాల్సింది అదే" అని సచిన్ ఆ లేఖలో పేర్కొన్నారు.
క్రైమ్లో భాగస్వాములం: ఎవరో చెప్పుకోండి చూద్దాం అంటూ కోహ్లీ ట్వీట్
|
నాకు ఏడుపొచ్చింది
"రిటైర్మెంట్ సందేశం ఇచ్చేటప్పుడు నాకు ఏడుపొచ్చింది. ఆఖరి సారి ఔటై పెవిలియన్ ఒక్కోమెట్టు ఎక్కుతున్నప్పుడు కుంగిపోతున్నట్టు అనిపించింది. నా బుర్రలో ఏమేమో ఆలోచనలు వస్తున్నాయి. వాటిని దాచుకోలేకపోయాను. నేను ప్రపంచం ముందుకు వెళ్లినప్పుడు ప్రశాంతంగా ఉంది. నా కష్టానికి తగిన ఫలితం లభించినందుకు సంతోషంగా అనిపించింది" అని సచిన్ ఆ లేఖలో రాసుకొచ్చారు.