వన్డేల్లో 200కుపైగా సిక్సులు బాదిన ఏడో క్రికెటర్గా
ఆఖరి వన్డేలో హోల్డర్ వేసిన ఇన్నింగ్స్ 11వ ఓవర్లో బంతిని లాంగాన్లోకి బాదడంతో రోహిత్ శర్మ ఈ ఘనత సాధించాడు. ఈ క్రమంలో పాకిస్థాన్ మాజీ క్రికెటర్ షాహిద్ అఫ్రిది(195 ఇన్నింగ్స్) పేరిట ఉన్న రికార్డుని బద్దలు కొట్టాడు. అంతేకాదు వన్డేల్లో 200కుపైగా సిక్సులు బాదిన ఏడో క్రికెటర్గా రోహిత్ శర్మ నిలిచాడు.
రెండో బ్యాట్స్మన్గా రికార్డు
దీంతో పాటు భారత్ తరఫున అత్యధిక సిక్సర్లు (202)బాదిన రెండో బ్యాట్స్మన్గా రికార్డు సృష్టించాడు. ఈ జాబితాలో భారత్ తరుపున మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ (211 సిక్సులు) అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. అంతర్జాతీయ క్రికెట్లో ఆఫ్రిది, గేల్, జయసూర్య, డివిలియర్స్, మెకల్లమ్లు ఈ జాబితాలో ఉన్నారు.
ఒక క్యాలెండర్ ఇయర్లో 1000 పరుగులు
ఇదిలా ఉంటే, ఈ మ్యాచ్లో రోహిత్ శర్మ హాఫ్ సెంచరీ సాధించడంతో ఒక క్యాలెండర్ ఇయర్లో 1000 పరుగులు పూర్తి చేశాడు. కెప్టెన్ విరాట్ కోహ్లీ 1202 పరుగులతో అగ్రస్థానంలో ఉండగా రోహిత్ శర్మ 1030 పరుగులతో రెండో స్థానంలో ఉన్నాడు. స్వదేశంలో భారత్కు ఇది వరుసగా ఆరో వన్డే సిరీస్ విజయం కావడం విశేషం.
రెండో భారతీయుడిగా ధోని అరుదైన ఘనత
ఈ మ్యాచ్తో భారత్లో 200 అంతర్జాతీయ మ్యాచ్లు ఆడిన రెండో భారతీయుడిగా ధోని అరుదైన ఘనత సాధించాడు. ఈ జాబితాలో సచిన్ 258 మ్యాచ్లతో ముందున్నాడు. ఐదు వన్డేల సిరిస్లో అత్యధిక పరుగులు (453) సాధించిన భారత క్రికెటర్గా కోహ్లీ. మొత్తంగా పాక్ ఆటగాడు ఫఖర్ జమాన్(జింబాబ్వేపై 515) అగ్రస్థానంలో ఉన్నాడు.