సెంచరీ కోసం అన్ని బంతులు తీసుకోవాలా
అతడితో పాటు కోహ్లీ, మయాంక్, మిడిలార్డర్ ఆటగాళ్లు రాణించడంతో భారత్ 443/7 వద్ద ఇన్నింగ్స్ డిక్లేర్ చేసింది. పుజారా కెరీర్లో ఇది 17వ సెంచరీ అత్యధిక బంతులు తీసుకున్నదీ దీనికే కావడం గమనార్హం. తొలి వికెట్గా వెనుదిరిగిన విహారిని పక్కన పెడితే భారత తొలి ఇన్నింగ్స్లో బ్యాటింగ్ చేసిన వారందరిలో అతి తక్కువ సగటు పుజారాదే (33.23). ఈ నేపథ్యంలోనే పాంటింగ్ విమర్శలు చేశాడు.
బాక్సింగ్ డే టెస్టు సెంచరీతో పుజారా నెలకొల్పిన రికార్డులివే
సెంచరీ కోసమే ఆడినట్లు ఉంది:
‘భారత్ ఈ మ్యాచ్ గెలిస్తే పుజారాది గొప్ప ఇన్నింగ్స్. ఆసీస్ను వారు రెండు సార్లు ఆలౌట్ చేసేందుకు సమయం సరిపోకుంటే అతడే కారణం. అతడు మరో సెంచరీ చేసినట్టు అవుతుందంతే. సిరీస్లో పుజారా బాగా ఆడుతున్నాడు. కానీ వేగంగా పరుగులు చేయాల్సిన చోట నెమ్మదిగా ఆడుతున్నాడు. అతడు ఆడుతున్నప్పుడు రన్రేట్ను ఉరికించడం చాలా కష్టం అనుకుంటున్నా' అని పాంటింగ్ అన్నాడు.
అంతర్జాతీయ క్రికెట్ ఆడే ఉద్దేశ్యం..
మ్యాచ్ అనంతరం పూజారా మీడియా సమావేశానికి హాజరై మాట్లాడిన వీడియోను బీసీసీఐ తన అధికారిక ట్విట్టర్ ఖాతా ద్వారా పోస్టు చేసింది. 'నేను అంతర్జాతీయ క్రికెట్ ఆడే ఉద్దేశ్యం.. విమర్శకుల నోళ్లు మూయించాలని మాత్రమే కాదు. నాకు జట్టుకు పరుగులు సమకూర్చడం చాలా ఇష్టమైన పని కాబట్టే చేస్తున్నాను. అంతేకానీ, ప్రతి విషయాన్ని పట్టించుకుని వివాదాల్లోకి వెళ్లాలని కాదు. నా పని పరుగులు సాధించడం. నేను అదే చేస్తున్నా. సొంత గడ్డపైనైనా, విదేశీ గడ్డపైన అయినా సరే.
కొన్ని సార్లు అది సాధ్యపడకపోవచ్చు కూడా
ఈ క్రమంలో కొన్ని సార్లు విమర్శలకు గురి కావచ్చు. వాటిని ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలి. ఇలా భారత్ విజయాల పరంపరను సాధిస్తే అందరూ సంతోషించే విషయమే కదా. సొంతగడ్డపై పరుగులు సాధించడం కొంచెం తేలికనే చెప్పాలి. కానీ, విదేశీ గడ్డపై పరుగులు రాబట్టేందుకు చాలా కష్టపడాలి. కొన్ని సార్లు అది సాధ్యపడకపోవచ్చు కూడా. ఆసీస్ పర్యటనలో ఇప్పటికీ రెండు సెంచరీలు పూర్తి చేశా. నేను పరుగులు చేయగలననే నమ్మకం నాకుంది. కొన్ని సార్లు విదేశీ గడ్డపై అది సాధ్యపడదంతే'