|
లోగో మార్పు..
అపకమింగ్ సీజన్లోనైనా టైటిల్ అందుకోవాలని భావిస్తోంది. దీనికోసం యాజమాన్యం కూడా చేయాల్సిన కసరత్తులు చేస్తుంది. వేలంలో ఆటగాళ్లపై దృష్టిపెట్టిన జట్టు.. ఇప్పుడు తమ లోగోను మార్చింది. పేరు మారుస్తారిన ఊహాగానాలు వినిపించినా కేవలం లోగో మాత్రమే మార్చింది. ఈ కొత్తలోగో మీ అభిమాన జట్టుకు మధురానుభూతిని ఇస్తుందనుకుంటున్నాం. కొత్త శకం.. కొత్త ఆర్సీబీ.. ఇది మా సరికొత్త లోగో అని ట్వీట్ చేసింది. అయితే ఐపీఎల్ ప్రారంభమైనప్పటి నుంచి ఆర్సీబీ లోగో మార్చడం ఇది మూడోసారి.
సన్రైజర్స్ సెటైర్స్..
ఈ కొత్త లోగోపై సన్రైజర్స్ హైదరాబాద్ ఫ్రాంచైజీ వ్యంగ్యాస్త్రాలు సంధించింది. ‘ఈ సాల కప్ నమ్దే' నినాదాన్ని ట్వీట్ చేస్తూ ఈసాల లోగో బాగుందని ట్వీట్ చేసింది. అంతేకాకుండా ఆరెంజ్ ఆర్మీ కూడా ఇరగదీసెందుకు రెడీ అవుతుందని సుతిమెత్తంగా ఆర్సీబీని హెచ్చరించింది.
|
ఆర్సీబీ లోగో మార్చింది కదా.. కప్ మనదే..
ఇక ఆర్సీబీ లోగో మార్పుపై హైదరాబాద్ ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే ఆర్సీబీ లోగో మార్చిన ప్రతీసారి హైదరాబాద్ చాంపియన్గా నిలిచింది. ఇదే విషయాన్ని ప్రస్తావిస్తూ సోషల్ మీడియా వేదికగా పోస్ట్లు పెడుతున్నారు. 2009, 2016లో ఆర్సీబీ లోగో మార్చిందని, ఈ రెండుసార్లు హైదరాబాద్ చాంపియన్గా నిలిచిందనే విషయాన్ని గుర్తు చేస్తున్నారు.
టైటిలే లక్ష్యంగా..
గత 12 సీజన్లుగా ఆర్సీబీకి టైటిల్ అందని ద్రాక్షగానే మిగిలిపోయింది. 2016లో ఫైనల్కి చేరిన ఆర్సీబీ.. ఆ తర్వాత పేలవ ప్రదర్శనతో అభిమానుల్ని నిరాశపరిచింది. 2017,2018 2019 సీజన్లో వరుస పరాజయాల్ని చవిచూసిన ఆ జట్టు.. కనీసం ప్లేఆఫ్కి కూడా అర్హత సాధించలేకపోయింది. ఐపీఎల్ 2020 సీజన్లోనైనా టైటిల్ను ముద్దాడాలనే పట్టుదలతో ఉంది.