ఆసీస్ సిరిస్లో మా పొరపాట్లు తగ్గేలా దృష్టిసారిస్తున్నాం
"ఆస్ట్రేలియా సిరీస్లో మా పొరపాట్లు తగ్గేలా దృష్టిసారిస్తున్నాం. మా పరిస్థితి బాగాలేనప్పుడు వీలైనంత త్వరగా పరిష్కారం వెతకాలి. జట్టుగా సమస్య నుంచి బయటపడాలి. గత పర్యటనలో మంచి క్రికెట్ ఆడాం, కానీ మ్యాచ్లు గెలవలేదు. ఈ సారి దానిని మార్చాలని అనుకుంటున్నాం. మ్యాచ్లతో పాటు సిరీస్ గెలిచేందుకు ప్రయత్నిస్తాం" అని కోహ్లీ చెప్పాడు.
మూడు టీ20ల సిరీస్లో భాగంగా
మూడు టీ20ల సిరీస్లో భాగంగా బుధవారం బ్రిస్బేన్లోని గబ్బా స్టేడియంలో ఇరు జట్ల మధ్య తొలి టీ20 ప్రారంభం కానుంది. ఆ తర్వాత నాలుగు టెస్టులు, మూడు వన్డేల సిరిస్ జరగనుంది. కాగా, తొలి టీ20లో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ, వైస్ కెప్టెన్ రోహిత్ శర్మ ఓ రికార్డు కోసం పోటీపడబోతున్నారు.
అత్యధిక పరుగులు చేసిన బ్యాట్స్మెన్గా
అంతర్జాతీయ టీ20ల్లో అత్యధిక పరుగులు చేసిన బ్యాట్స్మెన్గా నిలిచేందుకు రోహిత్ శర్మ ఇంకో 65 పరుగులు చేయాల్సి ఉండగా.. విరాట్ కోహ్లి 170 పరుగుల దూరంలో ఉన్నాడు. అంతర్జాతీయ టీ20ల్లో అత్యధిక పరుగులు చేసిన బ్యాట్స్మెన్ జాబితాలో న్యూజిలాండ్ క్రికెటర్ మార్టిన్ గుప్తిల్ (2271)అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు.
87 మ్యాచ్ల్లో 2,207 పరుగులతో రెండో స్థానంలో రోహిత్
75 మ్యాచ్ల్లో గుప్తిల్ ఈ స్కోరుని సాధించాడు. ఆ తర్వాత రోహిత్ శర్మ 87 మ్యాచ్ల్లో 2,207 పరుగులతో రెండో స్థానంలో ఉన్నాడు. పాకిస్థాన్ మిడిలార్డర్ బ్యాట్స్మెన్ షోయబ్ మాలిక్ 108 మ్యాచ్ల్లో 2,190 పరుగులతో మూడో స్థానంలో ఉండగా న్యూజిలాండ్ మాజీ క్రికెటర్ బ్రెండన్ మెక్కల్లమ్ 71 మ్యాచ్ల్లో 2,140 పరుగులతో నాలుగో స్థానంలో కొనసాగుతున్నాడు. ఈజాబితాలో కెప్టెన్ విరాట్ కోహ్లీ 2,102 పరుగులతో ఉన్నాడు.