30 పరుగుల్లోపే ఔటై పెవిలియన్కు
"30 పరుగుల్లోపే ఔటై పెవిలియన్ బాట పట్టారు. దాని అర్థం భారత్ బాగా ఆడిందని కాదు. వారు కూడా పూర్తి స్థాయిలో ప్రదర్శన చేయలేదు. అయితే తొలి టెస్టులో ఆతిథ్య జట్టుకు కొన్ని సానుకూల అంశాలు కూడా ఉన్నాయి. జట్టును మార్చకుండా రెండో టెస్టుకు సైతం ఇదే కూర్పును కొనసాగించాలి. ఆటగాళ్లను మారిస్తే వారిలో ఆత్మవిశ్వాసం దెబ్బతింటుంది" అని పాంటింగ్ పేర్కొన్నాడు.
31 పరుగుల తేడాతో భారత్ విజయం
చివరి వరకు ఆసక్తికరంగా సాగిన అడిలైడ్ టెస్ట్లో భారత్ 31 పరుగుల తేడాతో విజయం సాధించిన సంగతి తెలిసిందే. దీంతో నాలుగు టెస్ట్ల సిరీస్లో టీమిండియా 1-0 ఆధిక్యంలో నిలిచింది. టీమిండియా నిర్దేశించిన 323 పరుగుల లక్ష్యఛేదన కోసం ఓవర్నైట్ స్కోరు 104/4తో ఆఖరి రోజు ఆట కొనసాగించిన ఆస్ట్రేలియా 291 పరుగులకు ఆలౌటైంది.
మూడు వికెట్లు తీసిన షమీ, అశ్విన్
భారత బౌలర్లలో జస్ప్రీత్ బుమ్రా(3/68), మహమ్మద్ షమీ(3/65), రవిచంద్రన్ అశ్విన్ (3/92) మూడేసి వికెట్లు తీసి భారత విజయంలో కీలకపాత్ర పోషించారు. ఇషాంత్శర్మ(1/48)కు ఒక వికెట్ దక్కింది. షాన్ మార్ష్(60) హాఫ్ సెంచరీతో ఆకట్టుకోగా కెప్టెన్ టిమ్ పైన్(41) ఫర్వాలేదనిపించాడు. చివర్లో నాథన్ లియాన్(38 నాటౌట్) గెలుపుపై ఆశలు రేపాడు.
పుజారాకు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్
భారత తొలి ఇన్నింగ్స్లో సెంచరీ సాధించిన మిడిలార్డర్ బ్యాట్స్మన్ ఛటేశ్వర్ పుజారాకు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ దక్కింది. తాజా ఆస్ట్రేలియా పర్యటనలో తొలి టెస్ట్ గెలవడం భారత్కు ఇదే మొదటిసారి. గత 11 పర్యాయాలు రెండు సార్లు డ్రా, 9 సార్లు ఓటములు ఎదుర్కొంది. ఆస్ట్రేలియా పర్యటనకు భిన్నంగా ఇంగ్లాండ్లో(1986), దక్షిణాఫ్రికాలో(2006) ఒకసారి, న్యూజిలాండ్లో మూడుసార్లు, విండిస్ రెండుసార్లు తొలి టెస్ట్లో భారత్ విజయాలు సాధించింది.