షమీకి సైతం చోటు
మూడో వన్డేలో గాయపడిన భువనేశ్వర్ కుమార్కు సెలక్టర్లు జట్టులో చోటు కల్పించలేదు. భువనేశ్వర్ కుమార్ వెన్ను గాయం మరింత ఎక్కువైందని, టెస్టు జట్టులోకి అతన్ని తీసుకోవాలా వద్ద అన్నది త్వరలోనే నిర్ణయిస్తామని ఆ ప్రకటనలో బోర్డు చెప్పింది. ఇక యో-యో టెస్టులో పాసైన పేస్ బౌలర్ మహ్మద్ షమికి కూడా టెస్టు జట్టులో సెలక్షన్ కమిటీ చోటు కల్పించింది.
ఇంగ్లాండ్ పర్యటనని మెరుగ్గా ఆరంభించిన రోహిత్
కానీ, ఇంగ్లాండ్ పర్యటనని మెరుగ్గా ఆరంభించిన రోహిత్ శర్మకు మాత్రం సెలక్టర్లు మొండిచేయి చూపించడంపై అతడి టెస్టు కెరీర్ ముగిసినట్లేనని భావిస్తున్నారు. మూడో టీ20లో కేవలం 56 బంతుల్లోనే 11 ఫోర్లు, 5 సిక్సుల సాయంతో 100 పరుగులతో నాటౌట్గా నిలిచాడు. ఆ తర్వాత తొలి వన్డేలోనూ 114 బంతుల్లో 15 ఫోర్లు, 4 సిక్సుల సాయంతో 137 పరుగులతో నాటౌట్గా నిలిచాడు.
రోహిత్ ప్రదర్శనను పరిగణలోకి తీసుకోని సెలక్టర్లు
అయినా సరే, టెస్టు జట్టు ఎంపికలో రోహిత్ శర్మ ప్రదర్శనని సెలక్టర్లు పరిగణలోకి తీసుకోకపోవడం ఆశ్చర్యం కలిగిస్తుంది. వన్డే, టీ20ల్లో ఓపెనర్గా వచ్చే రోహిత్ శర్మ.. టెస్టుల్లో మాత్రం మిడిలార్డర్లో బ్యాటింగ్ చేస్తుంటాడు. అయితే, సెలక్టర్లు ఎంపిక చేసిన జట్టుని పరిశీలిస్తే మిడిలార్డర్లో పుజారా, రహానె, కరుణ్ నాయర్, దినేశ్ కార్తీక్కి అవకాశం దక్కింది.
టెస్టు జట్టుకు తొలిసారి ఎంపికైన రిషబ్ పంత్
ప్రత్యామ్నాయ వికెట్ కీపర్గా రిషబ్ పంత్కు తొలిసారి టెస్టు జట్టులో సెలక్టర్లు చోటు కల్పించగా.. మూడో ఓపెనర్ కేఎల్ రాహుల్కి కూడా సెలక్టర్లు చోటు కల్పించారు. కాగా, ఐదు టెస్టు మ్యాచ్ల సిరిస్లో భాగంగా ఆతిథ్య ఇంగ్లాండ్తో ఆగస్టు 1న ఎడ్బాస్టన్ వేదికగా భారత్ తొలి టెస్టు ఆడనుంది.