ఐపీఎల్లో ఆర్సీబీ జట్టుకు
ఈ ఐపీఎల్ సీజన్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు తరుపున మొత్తం 13 మ్యాచ్లు ఆడిన నవదీపై షైనీ 11 వికెట్లు పడగొట్టడంతో పాటు 141 డాట్ బాల్స్ విసిరాడు. దీంతో ఐపీఎల్ 12వ సీజన్లో టాప్-5 బౌలర్లలో ఒకడిగా నిలిచాడు. నిజానికి లెధర్ బాల్తో 2013 వరకు నవదీప్ షైనీ పెద్దగా క్రికెట్ ఆడింది లేదు.
టెన్నిస్ బాల్తో క్రికెట్ మ్యాచ్లు
తన హౌం టౌన్లో టెన్నిస్ బాల్తో క్రికెట్ మ్యాచ్లు ఆడే నవదీప్ షైనీ ఒక్కో మ్యాచ్కి రూ. 200 సంపాదించేవాడు. అయితే, టీమిండియా మాజీ ఓపెనర్ గౌతమ్ గంభీర్కు 15 నిమిషాల నెట్ సెషన్ అతడి క్రికెట్ కెరీర్ను ఓ మలుపు తిప్పింది. అందుకే గౌతమ్ గంభీర్ వల్లే తాను ఈరోజు ఈ స్థాయిలో ఉన్నానని షైనీ చెప్పుకుంటుంటాడు.
క్రెడిట్ అంతా గంభీర్కే
తనలో ఉన్న టాలెంట్ను ప్రోత్సహించినందుకు గాను క్రెడిట్ మొత్తం గంభీర్కే దక్కుతుందని అన్నాడు. ఈ సందర్భంగా నవదీప్ షైనీ మాట్లాడుతూ "నా కెరీర్లో గంభీర్ భయ్యా సహకారాన్ని ఎప్పటికీ మరిచిపోలేను. ఈ స్థాయిలో నేను ఇక్కడ ఉన్నానంటే అందుకు కారణం అతడే. నేను ఏమైనా సాధిస్తే, అందులో గంభీర్ పేరు తప్పక ఉంటుంది" అని అన్నాడు.
నా కుటుంబం తర్వాత అంతా గంభీరే
"నా కుటుంబం తర్వాత నాకు అంతా గంభీర్ బయ్యానే. నేను ఇప్పుడు ఇక్కడ ఆడుతున్నాను, అంతకుముందు హర్యానాలో ఆడేటప్పుడు నేను ఎవరికీ తెలియదు. గంభీర్ భయ్యానే నన్ను ఇక్కడికి తీసుకొచ్చి ఢిల్లీ తరుపున ఆడేలా సహకారం అందించాడు. ఈ విషయం ఇప్పుడు అందరికీ తెలుస్తుంది. గంభీర్ నాకు మద్దతు ఇచ్చిన విధానం, నా సామర్ధ్యాలపై నమ్మకం, నా జీవితంలో నేను ఎప్పటికీ మరచిపోలేను" అని నవదీప్ షైనీ అన్నాడు.
షైనీతో పాటు ఖలీల్ అహ్మద్లు నెట్ బౌలర్లుగా
ఇంగ్లాండ్ వేదికగా ముగిసిన వన్డే వరల్డ్ కప్లో నవదీప్ షైనీతో పాటు ఖలీల్ అహ్మద్లు నెట్ బౌలర్లుగా ఎంపికైన సంగతి తెలిసిందే. ఇప్పుడు అదే ఇద్దరు బౌలర్లే వెస్టిండిస్ పర్యటనకు సైతం పరిమిత ఓవర్ల ఫార్మాట్లో భారత జట్టులో చోటు దక్కించుకున్నారు. వెస్టిండిస్ పర్యటనలో భాగంగా టీమిండియా 3 టీ20లు, 3 వన్డేలు, రెండు టెస్టులు ఆడనుంది. తొలి రెండు టీ20లు అమెరికాలోని ఫ్లోరిడాలో జరుగనుండగా మిగిలిన మ్యాచ్లన్నింటికీ వెస్టిండీస్ అతిథ్యమివ్వనుంది.
వెస్టిండిస్ పర్యటనకు టీమిండియా
టీ20 జట్టు:
కోహ్లీ (కెప్టెన్), రోహిత్ (వైస్ కెప్టెన్), ధావన్, రాహుల్, అయ్యర్, మనీశ్, పంత్(వికెట్ కీపర్), జడేజా, సుందర్, రాహుల్ చహర్, దీపక్ చహర్, భువనేశ్వర్, కృనాల్, ఖలీల్, సైనీ.
వన్డే జట్టు:
కోహ్లీ(కెప్టెన్), రోహిత్ (వైస్ కెప్టెన్), ధావన్, రాహుల్, అయ్యర్, పంత్(వికెట్ కీపర్), మనీశ్, జడేజా, కుల్దీప్, చాహల్, జాదవ్, షమీ, భువనేశ్వర్, ఖలీల్, సైనీ.