భారత మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ, గౌతమ్ గంభీర్ కోచింగ్ సామర్థ్యంపై తన అభిప్రాయాలను పంచుకున్నారు. 2027లో దక్షిణాఫ్రికాలో జరగనున్న వన్డే ప్రపంచకప్ గంభీర్ కోచింగ్ కెరీర్లో అతిపెద్ద పరీక్ష కానుందని గంగూలీ అభిప్రాయపడ్డారు. వైట్-బాల్ క్రికెట్లో గణనీయమైన విజయాలు సాధించినప్పటికీ, టెస్ట్ క్రికెట్లో సవాళ్లను ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు.
గంభీర్ ఆధ్వర్యంలో టీమిండియా వైట్-బాల్ క్రికెట్లో అద్భుతమైన ప్రదర్శన కనబరిచింది. ఇందులో ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ, 2026 టీ20 ప్రపంచకప్ విజయాలు ఉన్నాయి. అయితే, టెస్ట్ క్రికెట్లో మాత్రం ఇంకా తనదైన ముద్ర వేయలేకపోయారు, సొంతగడ్డపై, విదేశాల్లోనూ భారత్ సిరీస్ ఓటములను చవిచూసింది.
వైట్-బాల్ కోచ్గా గంభీర్ను గంగూలీ ప్రశంసిస్తూనే, టెస్ట్ క్రికెట్లో మెరుగుపడాల్సిన అవసరాన్ని నొక్కి చెప్పారు. ముఖ్యంగా పిచ్లపై తన దృష్టిని మరల్చాలని, సొంతగడ్డపై టర్నింగ్ ట్రాక్లు అవసరం లేదని, మంచి పిచ్లపై కూడా భారత్ గెలవగలదని సూచించారు. ఇంగ్లాండ్ సిరీస్లో భారత్ ప్రదర్శనను దీనికి ఉదాహరణగా చూపారు.

ఓ జాతీయ పత్రికకు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో సౌరవ్ గంగూలీ మాట్లాడుతూ, "గౌతమ్ చాలా మంచి కోచ్. బోర్డర్-గవాస్కర్ ట్రోఫీకి ముందు, అతనికి 'కొంత సమయం ఇవ్వాలి' అని నేను గతంలో చెప్పాను. వైట్బాల్ కోచ్గా గంభీర్ కెపాసిటీ అద్భుతం, ముఖ్యంగా ఈ కండిషన్స్లో అతనికి చాలా మంచి జట్టు ఉంది. " అని అన్నారు.
రెడ్బాల్లో గంభీర్ ఇంకా మెరుగుపడాల్సిన అవసరం ఉందన్న టీమిండియా మాజీ కెప్టెన్... అలా చేయాలంటే పిచ్ గురించి తక్కువగా ఆలోచించాలని పేర్కొన్నారు. ఇంగ్లాండ్ సిరీస్ను చూస్తే పిచ్ స్వభావం తెలిసి కూడా ఏమీ చేయలేకపోయాడు, అది ఫలితాల్లో కనిపించింది. స్వదేశంలో టర్న్ అయ్యే పిచ్లపైనే ఆధారపడాల్సిన అవసరం లేదని... మంచి పిచ్లు మంచి ఫలితాలను ఇస్తాయని గంగూలి వివరించారు.
అలాగే, 2027లో దక్షిణాఫ్రికాలో గంభీర్ అసలైన వైట్బాల్ పరీక్షను ఎదుర్కొటాడని దాదా జోస్యం చెప్పాడు. "అక్కడి పరిస్థితులు అతనికి సవాలు విసురుతాయి, కానీ అతని దగ్గర ఉన్న జట్టుతో దానిని సరిదిద్దుకోగలడని నేను నమ్ముతున్నాను" అని గంగూలీ ధీమా వ్యక్తం చేశారు.
టీమిండియా 2027లో దక్షిణాఫ్రికాలో జరగనున్న వన్డే ప్రపంచకప్లో భిన్నమైన సవాళ్లను ఎదుర్కొంటుందని గంగూలీ అభిప్రాయపడ్డారు. టీ20లలో భారత జట్టు నైపుణ్యాల పరంగా పటిష్టంగా ఉన్నప్పటికీ, వన్డేలలో ఇంకా మెరుగుపడటానికి చాలా అవకాశం ఉందన్నారు, ముఖ్యంగా బౌలింగ్లో. జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్ మినహా, జట్టులో అసలుసిసలైన మ్యాచ్ విన్నర్లు లేరని ఆయన ఎత్తి చూపారు.
బ్యాటింగ్ లోతు కూడా ఒక ఆందోళన కలిగించే అంశమని గంగూలీ పేర్కొన్నారు. రవీంద్ర జడేజా గతంలోలా ప్రభావం చూపడం లేదని, హార్దిక్ పాండ్యా వన్డేలు ఆడే విషయంపై స్పష్టత లేదని వివరించారు. శుభ్మన్ గిల్, రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్లతో టాప్ ఆర్డర్ బలంగా ఉన్నప్పటికీ, లోయర్ ఆర్డర్, బౌలింగ్ విభాగంలో మరింత పదను చేయాల్సి ఉందని గంగూలీ నొక్కి చెప్పారు.
ఈ సవాళ్లను అధిగమించడం గౌతమ్ గంభీర్కు అతిపెద్ద పరీక్షగా నిలుస్తుందని గంగూలీ స్పష్టం చేశారు. రాబోయే నెలల్లో జట్టులోని ఈ సమస్యలను గంభీర్ పరిష్కరించాల్సి ఉంటుందని ఆయన అన్నారు, ఇది అతనికి నిజమైన నాయకత్వ పటిమను చాటుకునే అవకాశం అని పేర్కొన్నారు.