|
పూర్తి కమర్షియల్ ప్రమోషన్
అయితే ధోనీ క్రికెట్కు సంబంధం లేని విషయాన్ని ధోనీ ప్రకటించాడు. ధోనీ ఏం చెబుతాడోనని సోషల్ మీడియాలో 2గంటలకు కళ్లప్పగించి చూసిన నెటిజన్లకు షాకిచ్చాడు. చాలా మంది అభిమానులు హమ్మయ్యా రిటైర్మెంట్ విషయం కాదని కాస్త కూల్ అయినా.. మరికొందరు మాత్రం అడ్వర్టైజ్ మెంట్ కోసం ఫ్యాన్ ఫాలోయింగ్ను వాడుకున్న ధోనీ కమర్షియాలిటీని తీవ్రంగా తప్పుపడుతున్నారు. ఇంతకీ ధోనీ ప్రకటించిన విషయం ఏంటంటే.. ప్రముఖ బిస్కెట్ బ్రాండ్ అయిన ఓరియోను మరోసారి 2022లో లాంచ్ చేశాడు. ఇది పూర్తిగా కమర్షియల్ ప్రమోషన్ మాత్రమే.
|
రిపోర్టర్ను దగ్గర కూర్చోబెట్టుకుని మరీ..
ఇకపోతే ఒక రిపోర్టర్ను ధోనీ బిస్కెట్ బ్రాండ్ లాంచింగ్ సందర్భంగా వేదికపైకి ఆహ్వానించాడు. 2011లో ఓరియో బిస్కెట్ బ్రాండ్ను ప్రారంభించినప్పుడు భారత్ ప్రపంచకప్ గెలిచిందని చెప్పాడు. ఈ సంవత్సరం మనకు మరో ప్రపంచకప్ (టీ20 ప్రపంచకప్) ఉంది. ఈ ఏడాది కూడా ఓరియో బిస్కెట్ బ్రాండ్ను మళ్లీ ప్రారంభించినందున భారత్ మరోసారి టైటిల్ ముద్దాడగలదు' అంటూ ఓ కవరింగ్ ఇచ్చాడు.
|
ఎమోషన్స్తో ఆడుకోవడం అలవాటైంది
బిస్కెట్ బ్రాండ్ ప్రమోట్ చేసి ఫ్యాన్స్ సస్పెన్స్కు తెరదించిన ధోనీ పట్ల నెటిజన్లు రకరకాల పోస్టులు చేస్తున్నారు. ఎమోషన్స్తో ఆడుకోవడం క్రికెటర్లకు అలవాటయిపోయిందంటూ మండిపడుతున్నారు. మొన్నటికి మొన్న సౌరవ్ గంగూలీ ఇలాగే ఓ ఎడ్యుకేషన్ యాప్ విషయంలో నానా హంగామా చేశాడు. అభిమానులు తమ ఆరాధ్య క్రికెటర్ గురించి ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తారని ఇలా ఇలాంటి కమర్షియల్ ప్రాజెక్టుల కోసం అభిమానాన్ని బలిపెట్టొద్దంటూ మండిపడుతున్నారు. ఇంకొందరు ఓరియో బిస్కెట్ లాంచ్ చేస్తే ఇండియా గెలిచిందనడం ఎంత వరకు కరెక్ట్ అంటూ సీరియస్ అవుతున్నారు. టు క్రియేట్ హిస్టరీ.. టు రిక్రియేట్ హిస్టరీ అంటూ క్యాప్షన్ పేరిట ఇలాంటి కమర్షియల్ యాడ్స్ చేయడం అభిమానులను స్కామ్ చేయడమేనంటూ ఇంకొందరు అంటున్నారు. ఇకపోతే ఏదేమైనా ఎంఎస్డీ లైవ్ అనేసరికి ఏకంగా లక్ష యాభైవేల మంది రియల్ టైం ఫ్యాన్స్ ఈ ప్రెస్ మీట్ చూశారు.