ప్రశంసల వర్షం:
వెస్టిండీస్తో జరిగిన టెస్టు సిరీస్లో బుమ్రా భారత్ను గెలిపించగా.. ఆస్ట్రేలియాతో హెడింగ్లీలో జరిగిన యాషెస్ సిరీస్ను ఇంగ్లండ్ సమం చేయడంలో ఆర్చర్ కీలక పాత్ర పోషించాడు. దీంతో ఈ ఇద్దరిపై పలువురు మాజీలు ప్రశంసల వర్షం కురిపించారు. మరోవైపు మీడియా ఆకాశానికి ఎత్తుకుంది. దీంతో అసంతృప్తి చెందిన రబడ మీడియాపై ఆగ్రహం వ్యక్తం చేసాడు. భారత్తో ద్వైపాక్షిక సిరీస్ ఆడడానికి దక్షిణాఫ్రికా ఇక్కడికి వచ్చిన విషయం తెలిసిందే.
బుమ్రా బంతితో అద్భుతాలు చేస్తున్నాడు:
తాజాగా రబడ మాట్లాడుతూ... 'ఆర్చర్, బుమ్రాలను మంచి బౌలర్లు. నేను కచ్చితంగా వారిని అభినందిస్తా. ఇద్దరు తక్కువ కాలంలోనే అద్భుత ప్రదర్శన చేసి జట్టులో రెగ్యులర్ ఆటగాళ్లగా మారారు. తమ ప్రదర్శనతో ప్రత్యేక స్థానం కూడా సంపాదించుకున్నారు. ఆర్చర్ సహజసిద్ధమైన బౌలర్. బుమ్రా బంతితో అద్భుతాలు చేస్తున్నాడు. ఇద్దరు ఒంటిచేత్తో జట్టుకు విజయాలు అందిస్తున్నారు' అని పేర్కొన్నాడు.
మీడియాపై ఆగ్రహం :
'కేవలం ఆర్చర్, బుమ్రాలు మాత్రమే అత్యుత్తమ ప్రదర్శన ఇవ్వడం లేదు. నేను కూడా చాలా కాలంగా మంచి ప్రదర్శన చేస్తున్నా. ఈ విషయం అందరికి తెలుసు. ఎప్పుడూ ఆ ఇద్దరే టాప్లో ఉండరని కచ్చితంగా చెప్పగలను. కొంతమంది క్రికెటర్లను మాత్రమే మీడియా హైప్ చేస్తుంది. పలువురి క్రికెటర్లకు మీడియాలో లభించిన క్రేజ్ను చూస్తే తనను ఆశ్చర్యానికి గురి చేస్తుంది. భారత దేశానికి తిరిగి రావడం సంతోషంగా ఉంది. క్రికెట్ ఆడటానికి ఎదురుచూస్తున్నా' అని రబడ తెలిపాడు.
ఆసీస్దే యాషెస్.. నాలుగో టెస్టులో పోరాడి ఓడిన ఇంగ్లండ్!!
రెండో స్థానంలో రబడ:
ఇటీవల విడుదల చేసిన ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్లో ఆసీస్ పేసర్ పాట్ కమ్మిన్స్ అగ్ర స్థానంలో ఉండగా.. రబడ రెండో స్థానంలో కొనసాగుతున్నాడు. ఇక బుమ్రా మూడో స్థానానికి చేరుకున్నాడు. వెస్టిండీస్తో జరిగిన రెండు టెస్టుల సిరీస్లో 13 వికెట్లను తీయడంతో తన ర్యాంకింగ్ను మెరుగుపరుచుకున్నాడు. దక్షిణాఫ్రికా టీ20, టెస్ట్ జట్టులో రబడకు చోటు దక్కిన విషయం తెలిసిందే.