మైదానంలో అంతకంటే కఠినంగా ఉంటాడని
‘కోహ్లి బయట ఎంత సరదాగా ఉంటాడో.. మైదానంలో అంతకంటే కఠినంగా ఉంటాడని అందరికీ తెలుసు. కానీ నాతో మాట్లాడేటపుడు విరాట్ జోకులు పేల్చాడు. అలాగే నాతో మరాఠీలో మాట్లాడేందుకు ప్రయత్నించాడు. అది సరదాగా అనిపించింది' అని అతనన్నాడు.
కొంచెం ఒత్తిడి కూడా ఎదుర్కొంటున్నా
ఇక తొలి టెస్టు ఆడబోతున్న అనుభవం గురించి పృథ్వీ స్పందిస్తూ.. ‘చాలా సంతోషంగా ఉంది. గర్వంగా అనిపిస్తోంది. అలాగే కొంచెం ఒత్తిడి కూడా ఎదుర్కొంటున్నా. ఐతే డ్రెస్సింగ్ రూంలో సీనియర్, జూనియర్ అన్న తేడా ఏమీ ఉండదని కోహ్లి, రవిశాస్త్రి చెప్పారు. నాకు అక్కడ చాలా సౌకర్యంగా అనిపించింది. అందుక్కారణం కోహ్లినే. నేను రంజీ ట్రోఫీలో ఎలా ఆడతానో అలాగే ఇక్కడా ఆడమని రవిశాస్త్రి సలహా ఇచ్చాడు' అని చెప్పాడు.
|
టెస్టు క్యాప్ అందుకోవడం సంతోషంగా
ఇంత చిన్న వయస్సులో డ్రెస్సింగ్ రూమ్లో నన్ను చూడటం అందరికీ ఆనందంగా అనిపించింది. ఈ క్రమంలోనే తొలి రోజు ప్రాక్టీస్ సెషన్ను చక్కగా ముగించాం. నాకు చాలా గర్వంగా గొప్పగా అనిపించింది. విరాట్ కోహ్లీ నన్ను కంఫర్టబుల్గా ఉండేందుకు సాయం చేశాడు. నెట్స్లో ఆడేందుకు ఖాళీ మైండ్తో బరిలోకి దిగుతా. బంతిని బట్టి స్పందిస్తా. కోచ్ రవిశాస్త్రి.. రంజీ ట్రోఫీల్లో ఎలాగైతే ఆడానో అలానే ఆడమని చెప్పారు. టెస్టు క్యాప్ అందుకోవడం చాలా సంతోషంగా అనిపించింది'
ధావన్.. రాహుల్లను ఓపెనర్లుగా భావించి
ముంబై యువ క్రికెటర్ పృథ్వీ షా అరంగ్రేటంతో టీమిండియా నిర్ణయం మార్చుకుంది. ముందుగా శిఖర్ ధావన్.. కేఎల్ రాహుల్లను ఓపెనర్లుగా భావించినా.. ఆ తర్వాత ధావన్ స్థానాన్ని పృథ్వీ షా భర్తీ చేశాడు. గతంలో ఇంగ్లాండ్తో జరిగిన రెండు టెస్టుల్లో టీమిండియాకు పృథ్వీ నిర్ణయం మార్చుకున్నాడు.