అయితే మూడు మ్యాచ్ల సిరీస్లో భాగంగా వెస్టిండీస్తో ఈ నెల 8న మొదలయ్యే ఫస్ట్ టెస్ట్కు రెగుల్యర్ కెప్టెన్ జో రూట్ అందుబాటులో ఉండటం లేదు. దీంతో ఇంగ్లండ్ బోర్డు స్టార్ ఆల్రౌండర్ బెన్ స్టోక్స్కు కెప్టెన్సీని అప్పగించింది. జోస్ బట్లర్ను వైస్ కెప్టెన్గా నియమించింది. రూట్ భార్య వచ్చే వారం తమ రెండో బిడ్డకు జన్మనివ్వనుంది. ప్రస్తుతం జట్టుతో కలిసున్న రూట్ నేడు నేడు ట్రైనింగ్ క్యాంప్ వదిలి వెళ్లనున్నాడు. దీంతో ఇంగ్లండ్ టీమ్ తమలో తాము ఆడే వామప్తో పాటు ఫస్ట్ టెస్ట్కు దూరం కానున్నాడు. సెకండ్ టెస్ట్కు తిరిగి జట్టుతో కలుస్తాడు.
BREAKING: England captain Joe Root will miss the first #ENGvWI Test match to attend the birth of his second child.
— ICC (@ICC) June 30, 2020
Ben Stokes will captain in his place. pic.twitter.com/wUD08jes4E
వర్ణ వివక్షకు వ్యతిరేకంగా గళం వినిపిస్తున్న వెస్టిండీస్.. ఇంగ్లండ్తో జరిగే తొలి టెస్టులో తమ జెర్సీ కాలర్పై 'బ్లాక్ లైవ్స్ మ్యాటర్' అని ముద్రించిన లోగోతో బరిలోకి దిగనున్నారు.
జాతి వివక్షకు వ్యతిరేకంగా సాగుతున్న ఈ కార్యక్రమంలో భాగమయ్యేందుకు అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) విండీస్ జట్టుకు ప్రత్యేక అనుమతి ఇచ్చింది. విండీస్ ఆటగాళ్లు ధరించబోయే లోగోను అలీషా హోసానా డిజైన్ చేయగా... ఇటీవల మళ్లీ ప్రారంభమైన ఇంగ్లిష్ ప్రీమియర్ లీగ్ ఫుట్బాల్ టోర్నీలో 20 జట్ల ఆటగాళ్లు ఈ లోగోను ధరించారు. సరిగ్గా ఆ లోగోకే ఐసీసీ అనుమతి ఇచ్చింది. జాతి వివక్షకు వ్యతిరేకంగా సాగుతున్న పోరాటం గురించి ప్రచారం చేసి, దానికి సంఘీభావం తెలిపే బాధ్యత తమకుందని భావిస్తున్నట్లు వెస్టిండీస్ కెప్టెన్ జేసన్ హోల్డర్ తెలిపాడు.