మహమ్మద్ సిరాజ్..
ఐపీఎల్ 2022 సీజన్ మెగా వేలానికి ముందు మహమ్మద్ సిరాజ్ను ఆర్సీబీ రూ.7 కోట్ల భారీ ధరకు రిటైన్ చేసుకుంది. గత సీజన్లో నిలకడగా రాణించడంతో పాటు టీమిండియా తరఫున అద్భుత ప్రదర్శన కనబర్చడం, మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ మద్దతు ఉండటంతో ఆర్సీబీ అతన్ని రిటైన్ చేసుకుంది. హర్షల్ పటేల్ను కాదని మరీ సిరాజ్ను అంటిపెట్టుకున్నారు. కానీ అతను మాత్రం అంచనాలను అందుకోలేకపోయాడు. 15 మ్యాచ్లు ఆడిన అతను 9 వికెట్లు మాత్రమే తీసాడు. 10.08 ఎకానమీతో ధారళంగా పరుగులు సమర్పించుకున్నాడు. దాంతోనే సిరాజ్ను ఆర్సీబీని పక్కనపెట్టే అవకాశం ఉంది.
డేవిడ్ విల్లే..
మెగా వేలంలో 2 కోట్ల భారీ ధరకు కొనుగోలు చేసిన డెవిడ్ విల్లే ఆశించిన రీతిలోరాణించలేకపోయాడు. ఆరంభంలో అవకాశం దక్కినా.. గ్లేన్ మ్యాక్స్వెల్ రాకతో బెంచ్కే పరిమితమయ్యాడు. రెండు మ్యాచ్లు ఆడిన విల్లే కేవలం 18 పరుగులు మాత్రమే చేశాడు. బౌలింగ్లో ఒక్క వికెట్ మాత్రమే తీసాడు. అయితే నలుగురి ఫారిన్ ప్లేయర్లకు మాత్రమే అవకాశం ఉన్న నేపథ్యంలో విల్లేకు చోటు దక్కడం కష్టంగా మారింది. దాంతో విల్లేను వదిలేయాలనే ఆలోచనలో ఆర్సీబీ ఉంది.
షెఫ్రెన్ రూథర్ ఫోర్డ్..
షెఫ్రెన్ రూథర్ ఫోర్డ్ది కూడా విల్లే పరిస్థితే. తుది జట్టులో చోటు దక్కడం ఈ విండీస్ ఆల్రౌండర్కు కష్టంగా మారింది. గ్లేన్ మ్యాక్స్వెల్ను కాదని అతన్ని ఆడించే సాహసం ఆర్సీబీ చేయదు. ఆరంభ మ్యాచ్ల్లో అవకాశం అందుకున్న రూథర్ ఫోర్డ్.. కేవలం 33 పరుగులు మాత్రమే చేశాడు. బౌలింగ్లో పెద్దగా ప్రభావం చూపలేదు. ఈ క్రమంలోనే అతన్ని ఆర్సీబీ రిలీజ్ చేసే అవకాశం ఉంది.
అనూజ్ రావత్..
ఆర్సీబీ ఓపెనర్గా బరిలోకి దిగిన అనూజ్ రావత్ను కూడా ఆ జట్టు వదులుకునే అవకాశం ఉంది. ఫాఫ్ డుప్లెసిస్తో కలిసి ఇన్నింగ్స్ ప్రారంభించిన రావత్ ఆశించిన స్థాయిలో రాణించలేకపోయాడు. 16.13 సగటుతో కేవలం 129 పరుగులే చేశాడు. ఒక్క ముంబై ఇండియన్స్తో 47 బంతుల్లో 66 పరుగులు చేశాడు. మిగతా మ్యాచ్ల్లో దారుణంగా విఫలమయ్యాడు. దాంతో అతన్ని పక్కనపెట్టిన ఆర్సీబీ కోహ్లీని ఓపెనర్గా ఆడించి రజత్ పటీదార్ను జట్టులోకి తీసుకుంది. ఇక పటీదార్ ఈ అవకాశాన్ని అందిపుచ్చుకున్నాడు. అజేయ సెంచరీతో ఎలిమినేటర్ మ్యాచ్లో జట్టును ఒంటి చేత్తో గెలిపించాడు. ఈ క్రమంలోనే అనూజ్ రావత్ సేవలు జట్టుకు అవసరం లేకుండా పోయింది.