వార్నర్ వైఫల్యమే..
తాజాగా స్టార్ స్పోర్ట్స్ షోలో.. సన్రైజర్స్ హైదరాబాద్ పెర్ఫామెన్స్ను విశ్లేషించిన పఠాన్.. వార్నర్ వైఫల్యమే జట్టు కొంపముంచిందన్నాడు. 'సన్రైజర్స్ టీమ్ నాతో సహా అందర్ని ఆశ్చర్యపరిచింది. నా దృష్టిలో ఆ జట్టు టాప్-4. కానీ ఆ జట్టు అతిపెద్ద సమస్య వార్నర్ పేలవ బ్యాటింగ్, చెత్త కెప్టెన్సీ. అతను జట్టును నడిపించిన విధానం మరి దారుణం. ఇక అతని అతి జాగ్రత్త బ్యాటింగ్ జట్టుకు విజయాలను దూరం చేసింది. కేన్ విలియమ్సన్కు సారథ్య బాధ్యతలు అప్పగించడంతో సన్రైజర్స్ మేనేజ్మెంట్ కూడా వార్నర్ పట్ల అసంతృప్తితో ఉందనే విషయం స్పష్టమైంది. అందుకే ఈ కఠిన నిర్ణయం తీసుకుంది.'అని పఠాన్ చెప్పుకొచ్చాడు.
మ్యూజికల్ చైర్ గేమ్లా..
ఇక టీమ్ కాంబినేషన్ను కూడా ప్రస్తావించిన పఠాన్.. టీమ్మేనేజ్మెంట్పై విమర్శలు గుప్పించాడు. ఒక్కో మ్యాచ్ ఒక్కో ఆటగాడిని జట్టులోకి తెస్తూ మ్యూజికల్ చైర్ ఆటను ఆడిందని, ఇప్పటికైనా సరైన కాంబినేషన్ ఎంచుకోవాలని చురకలించాడు. 'సన్రైజర్స్ హైదరాబాద్ గురించి మాట్లాడిన ప్రతీసారి మిడిలార్డర్లో అనుభవపూర్వకమైన ఆటగాళ్లు లేరని చెబుతుంటాం. అనుభవం కలిగిన జాదవ్ ఉన్న అతనికి ఆరంభంలో అవకాశాలు దక్కలేదు. సుచిత్ను కొన్ని మ్యాచ్లు ఆడించారు. ఆ తర్వాత పక్కనపెట్టేసారు. ఇలా తరుచూ ఆటగాళ్లను మారుస్తూ వచ్చారు. ఇప్పటికైన సరైన కాంబినేషన్ ఎంచుకోవాలి. పైగా ఆ జట్టులో ఫ్లాట్ పిచ్పై గంటకు 140 కిలోమీటర్ల వేగంతో బంతులు వేయగల బౌలర్ల లేరు.'అని పఠాన్ చెప్పుకొచ్చాడు.
193 పరుగులే..
ప్రతీ సీజన్లో జట్టు బ్యాటింగ్ భారాన్ని మోసిన వార్నర్.. ఈ సీజన్లో దారుణంగా విఫలమయ్యాడు. 6 మ్యాచ్ల్లో 32.17 సగటుతో 193 రన్స్ మాత్రమే చేశాడు. స్ట్రైక్ రేట్ మరి పేలవంగా 110.29 మాత్రమే. దాంతో సన్రైజర్స్ వరుసగా ఓటమిపాలైంది. ఇక డేవిడ్ వార్నర్ 2014లో సన్రైజర్స్ హైదరాబాద్ జట్టులో చేరాడు. 2015లో జట్టు పగ్గాలు అందుకున్నాడు. ఇక 2016లో జట్టును విజేతగా నిలిపాడు. ఐపీఎల్లో అత్యధిక పరుగులు (5447) చేసిన విదేశీ ఆటగాళ్లలో అగ్రస్థానం వార్నర్దే. మెగా టోర్నీలో 50 అర్ధ సెంచరీలు చేసిన ఏకైక బ్యాట్స్మన్ అతడే. 2014 నుంచి ఆడిన ప్రతి సీజన్లోనూ కనీసం 500 పరుగులు చేస్తున్నాడు. అత్యధిక సార్లు ఆరెంజ్ క్యాప్ (2015, 2017, 2019) అందుకున్న ఆటగాడూ కూడా.