ఏడెనిమిది సీజన్లలో ఆర్సీబీకి కోహ్లీ కెప్టెన్గా
"గత ఏడెనిమిది సీజన్లలో ఆర్సీబీకి కోహ్లి కెప్టెన్గా వ్యవహరిస్తున్నప్పటికీ టైటిల్ గెలవలేకపోతోంది. అయినా ఆర్సీబీ యాజమాన్యం అతడిపై నమ్మకముంచింది. నిజంగా ఇది విరాట్ కోహ్లీ అదృష్టం. అందుకు ఆర్సీబీ యాజమాన్యానికి కోహ్లీ కృతజ్ఞత తెలపాలి. ఐపీఎల్లో విజేతలుగా నిలిస్తేనే కెప్టెన్లకు గౌరవం ఉంటుంది" అని గంభీర్ చెప్పుకొచ్చాడు.
కోహ్లీపై నమ్మకంతోనే
"అలా నిలవలేనివారు ఎంతో మంది జట్లు మారతున్నారు. అయినా కోహ్లీపై నమ్మకంతో ఆర్సీబీ యాజమాన్యం కొనసాగిస్తోంది" అని గంభీర్ పేర్కొన్నాడు. కాగా, ఐపీఎల్ 2019 సీజన్ మార్చి 23న ప్రారంభం కానుంది. టోర్నీలో భాగంగా 23న చెన్నై సూపర్ కింగ్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరు జట్ల మధ్య చెన్నైలోని చిదంబరం స్టేడియంలో తొలి మ్యాచ్ జరగనుంది.
తొలి సీజన్లో పేలవ ప్రదర్శన
కాగా, మూడుసార్లు ఫైనల్ చేరినప్పటికీ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఒక్కసారి కూడా ఐపీఎల్ ట్రోఫీ గెలవలేకపోయింది. తొలి సీజన్లో పేలవ ప్రదర్శన తర్వాత గొప్పగా పుంజుకుని ఫైనల్ చేరిన ఆ జట్టు త్రుటిలో టైటిల్కు దూరమైంది. 2011, 2016 సీజన్లలో సైతం ఆర్సీబీ అద్భుతమైన ఆటతో ఫైనల్ వచ్చినప్పటికీ టైటిల్ విజేతగా నిలవలేకపోయింది.
స్టార్ క్రికెటర్లు ఉన్నప్పటికీ
గత రెండు సీజన్లలో పేలవ ప్రదర్శన చేసింది. జట్టులో అద్భుతమైన ఆటగాళ్లు ఉన్నా... లీగ్ దశ కూడా దాటలేకపోయింది. అయితే, ఆ జట్టులో స్టార్ క్రికెటర్లు ఉన్నప్పటికీ సరైన సమయంలో సరైన నిర్ణయాలు తీసుకోకపోవడం వల్లే ఇప్పటివరకు టైటిల్ను గెలవలేకపోయిందని క్రికెట్ విశ్లేషకులు భావిస్తున్నారు.