హైదరాబాద్: మూడు సార్లు ఐపీఎల్ టైటిల్ విజేతగా నిలిచిన ముంబై ఇండియన్స్ ఐపీఎల్ 12వ సీజన్ లీగ్ దశను విజయంతో ముగించింది. టోర్నీలో భాగంగా వాంఖడే స్టేడియం వేదికగా ఆదివారం జరిగిన మ్యాచ్లో ముంబై ఇండియన్స్ జట్టు కోల్కతా నైట్రైడర్స్ జట్టును 9 వికెట్ల తేడాతో ఓడించింది. 134 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన ముంబై 16.1 ఓవర్లలో ఒక వికెట్ కోల్పోయి 134 పరుగులు చేసింది. ఈ విజయంతో 18 పాయింట్లతో ముంబై ఇండియన్స్ పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి చేరుకుంది. మరోవైపు కోల్కతా టోర్నీ నుంచి నిష్క్రమించింది.
ఐపీఎల్ 2019 రికార్డులు, గణాంకాలు, మ్యాచ్ స్కోరు వివరాల కోసం
That's that from the league stage of the #VIVOIPL.
— IndianPremierLeague (@IPL) May 5, 2019
Mumbai Indians win by 9 wickets and are now the table toppers. pic.twitter.com/F3V0Ga7OsY
🙌🙌#MumbaiIndians pic.twitter.com/eBuEfqPD51
— IndianPremierLeague (@IPL) May 5, 2019
ముంబై ఇండియన్స్ విజయ లక్ష్యం 134
ముంబై ఇండియన్స్తో జరిగిన మ్యాచ్లో క్రిస్ లిన్ 29 బంతుల్లో 41(2 ఫోర్లు, 4 సిక్సులు), రాబిన్ ఊతప్ప 47 బంతుల్లో 40(ఫోర్, 3 సిక్సులు) రాణించడంతో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన కోల్కతా నైట్ రైడర్స్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 133 పరుగులు చేసింది. దీంతో ముంబై ఇండియన్స్కు 134 పరుగుల విజయ లక్ష్యాన్ని నిర్దేశించింది. ముంబై బౌలింగ్లో మలింగ మూడు, హార్థిక్, బుమ్రా తలో రెండు వికెట్లు తీశారు.
Innings Break!
— IndianPremierLeague (@IPL) May 5, 2019
The Mumbai Indians restrict #KKR to a total of 133/7. How quickly will the home team achieve this target?#MIvKKR pic.twitter.com/IxLFkPPTUu
టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న ముంబై ఇండియన్స్
వాంఖడె స్టేడియంలో జరుగుతున్న ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన ముంబై ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. ముంబై ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మకు ఆ జట్టు తరుపున ఇది 150వ మ్యాచ్ కావడం విశేషం. ఈ మ్యాచ్లో ముంబై రెండు మార్పులతో బరిలోకి దిగింది. ఎవిన్ లూయిస్, బరీందర్ శ్రాన్ల స్థానంలో ఇశాన్ కిషన్, మిషెల్ మెక్లన్గన్లకు తుది జట్టులో చోటు కల్పించింది.
In other news, @mipaltan win the toss and elect to bowl first against @KKRiders.#MIvKKR pic.twitter.com/mh8CdTomCI
— IndianPremierLeague (@IPL) May 5, 2019
ఈ మ్యాచ్లో ముంబై ఇండియన్స్ గెలిచి పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి ఎగబాకింది. మరోవైపు ఈ సీజన్లో సన్రైజర్స్ అన్ని మ్యాచ్లు పూర్తయ్యాయి. తాజాగా ముంబైతో జరిగిన ఈ మ్యాచ్లో కోల్కతా ఓడటంతో హైదరాబాద్ మెరుగైన రన్రేట్తో ప్లేఆఫ్ బెర్త్ను ఖాయం చేసుకుంది.