క్రికెటర్గానే వీడ్కోలు పలుకుతున్నా..
క్రికెటర్గానే వీడ్కోలు పలుకుతున్నా.. యువ క్రికెటర్లని ప్రోత్సహించే బాధ్యత తప్పక తీసుకుంటానని గౌతమ్ ఇటీవల చెప్పుకొచ్చాడు. ఇప్పుడు ఆ దిశగానే అడుగులు వేస్తున్నట్లు తాజా పరిణామాలు దృష్ట్యా అర్థం చేసుకోవచ్చు. ఐపీఎల్లో అపార అనుభవం ఉన్న ఈ వెటరన్ ఓపెనర్.. కోల్కతాకి కెప్టెన్గా 2 టైటిల్స్ను అందించాడు. 2018వేలానికి ముందే ఆ జట్టు గౌతం గంభీర్ను కెప్టెన్గా తప్పించి విడుదల చేసిన ఆటగాళ్లతో పాటుగా వేలానికి ఉంచింది.
హాయ్.. బీసీసీఐ!! కెప్టెన్గా కోహ్లీని తొలగించండి..
పేలవ ఫామ్ కారణంగా.. నైతిక బాధ్యత వహిస్తూ
దీంతో అతనిని కొనుగోలు చేసుకున్న ఢిల్లీ డేర్డెవిల్స్ ఆశించినంత మేర రాబట్టుకోలేకపోయింది. దీంతో పేలవ ఫామ్ కారణంగా.. నైతిక బాధ్యత వహిస్తూ టోర్నీ మధ్యలోనే కెప్టెన్సీ నుంచి తప్పుకున్నాడు గంభీర్. ఆ తర్వాత జట్టు యాజమాన్యం టోర్నీ ముగిసే వరకూ కనీసం ఒక్క మ్యాచ్లో కూడా అవకాశం దక్కకుండా చేసింది.
సెహ్వాగ్ స్థానాన్ని భర్తీ చేస్తాడా..
ఇటీవల కింగ్స్ ఎలెవన్ పంజాబ్ టీమ్ మెంటార్ బాధ్యతల నుంచి వీరేంద్ర సెహ్వాగ్ తప్పుకుంటున్నట్లు ప్రకటించి పంజాబ్ జట్టుకు షాక్ ఇచ్చాడు. ఐపీఎల్ 2018 జరుగుతుండగానే ప్రీతి జింతాకు సెహ్వాగ్కు మధ్య విభేదాలు వచ్చాయని జట్టును వీడనున్నాడని వార్తలు వచ్చాయి. అప్పుడు కొట్టిపడేసినా ఇప్పుడు జరిగిన దానిని బట్టి చూస్తే అవి నిజమేననిపిస్తోంది. దీంతో సెహ్వాగ్తో పాటుగా బౌలింగ్ కోచ్ వెంకటేశ్ ప్రసాద్ కూడా జట్టు నుంచి స్వయంగా తప్పుకున్నాడు. దీంతో.. సెహ్వాగ్ స్థానంలో మెంటార్ బాధ్యతల్ని గంభీర్ స్వీకరించనున్నాడా..? లేదా బ్యాటింగ్ కోచ్గా వ్యవహరించనున్నాడా అనేది వేలం తర్వాత తెలియనుంది.