మహేంద్ర సింగ్ ధోని
టీమిండియా ఎన్నో అద్భుతమైన విజయాలను అందించిన కెప్టెన్గా ధోని భారత క్రికెట్ చరిత్రలో నిలిచిపోయాడు. భారత్కు మూడు ప్రతిష్టాత్మక ఐసీసీ ట్రోఫీలను అందించిన ఏకైక కెప్టెన్. గతేడాది పేలవ ప్రదర్శన చేసిన ధోని... ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ పర్యటనల్లో ఫామ్లోకి వచ్చాడు. ఈ నేపథ్యంలో ఈ ఏడాది జరిగే వరల్డ్కప్ తర్వాత ధోని రిటైర్ అయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. భారత్ వరల్డ్కప్ని నెగ్గితే.. సచిన్ టెండూల్కర్లానే ధోని కూడా తన కెరీర్కు గుడ్ బై చెబుతాడని క్రికెట్ విశ్లేషకులు భావిస్తున్నారు. ధోని ఐపీఎల్లో చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు కెప్టెన్గా ఉన్నాడు.
యువరాజ్ సింగ్
భారత్ బ్యాట్స్మెన్లలో యువరాజ్ సింగ్కు ప్రత్యేకమైన స్థానం ఉంది. 2011లో టీమిండియా వన్డే వరల్డ్కప్ను నెగ్గడంలో కీలకపాత్ర పోషించాడు. అంతర్జాతీయ క్రికెట్లో ఒకే ఓవర్లో ఆరు సిక్సులు కొట్టిన రికార్డు యువరాజ్ పేరిట ఉంది. గత కొన్నాళ్లుగా యువరాజ్ ఫామ్ లేమితో సతమతమవుతున్నాడు. దీంతో ఈ ఏడాది యువరాజ్ను ఐపీఎల్ ఫ్రాంచైజీలు తమ జట్టులోకి తీసుకొనేందుకు ఆసక్తి చూపలేదు. వేలంలో రెండో రౌండ్లో బేశ్ ధరకి ముంబై ఇండియన్స్ జట్టు దక్కించుకుంది. దీంతో ఈ ఐపీఎల్ తర్వాత యువరాజ్ సింగ్ రిటైర్మెంట్ ప్రకటిస్తాడని ఊహాగానాలు వినిపిస్తున్నాయి.
హర్భజన్ సింగ్
టీమిండియా వెటరన్ స్పిన్నర్గా పేరుగాంచిన హర్భజన్ సింగ్ భారత్కు ఎన్నో విజయాలు అందించాడు. ఇక ఐపీఎల్ ఆరంభ సీజన్ నుంచి హర్భజన్ సింగ్ ముంబై ఇండియన్స్ జట్టులో కొనసాగిన హర్భజన్.. గత సీజన్లో చెన్నై సూపర్ కింగ్స్కు ఆడాడు. గత ఐపీఎల్లోనూ ఆశించిన మేరకు రాణించలేదు. దీంతో 2019 ఐపీఎల్ సీజన్తో హర్భజన్ కూడా తన క్రికెట్ కెరీర్కి వీడ్కోలు పలుకుతాడనే వార్తలు వస్తున్నాయి.