వినూత్నంగా ఆలోచించిన ధోనీ బౌలర్లను:
ధోనీ బ్యాటింగ్ ఆర్డర్లో మార్పు చేయడంపై భిన్నాభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ఈ మ్యాచ్లో 154 పరుగుల లక్ష్య ఛేదనకు దిగిన చెన్నై వెంటవెంటనే 3 కీలక వికెట్లు చేజార్చుకొంది. పంజాబ్ బౌలర్లు మంచి స్వింగ్, సీమ్ రాబడుతున్నారు. ఈ క్రమంలో వినూత్నంగా ఆలోచించిన ధోనీ బౌలర్లు హర్భజన్, దీపక్ చాహర్ను క్రీజులోకి ముందు పంపించాడు.
అంచనాలకు తగ్గట్టుగానే భజ్జీ, చాహర్:
మహీ అంచనాలకు తగ్గట్టుగానే భజ్జీ, చాహర్ బ్యాటింగ్లో రాణించారు. వికెట్లు పడకుండా అడ్డుకున్నారు. అయితే ఈ సీజన్లో భజ్జీ తనను తాను నిరూపించుకోలేకపోయాడు. 12 మ్యాచుల్లో 7 వికెట్లు తీసి కేవలం 27పరుగులు చేశాడు. ఇది అతడి నుంచి ఆశించతగ్గ గణాంకాలు కావని కొందరి అభిప్రాయం.
భజ్జీని తప్పించి.. కర్ణ్శర్మను తీసుకుంటాడనీ:
భజ్జీని తప్పించి ప్లేఆఫ్ మ్యాచ్లకు ధోనీ.. కర్ణ్శర్మను తీసుకుంటాడనీ అంటున్నారు. గౌరవప్రదంగా సాగనంపడం మహీ ప్రత్యేకత అని అందుకే చివరి లీగ్ మ్యాచ్లో భజ్జీని ముందుగా పంపించాడని పేర్కొంటున్నారు. ఏదేమైనప్పటికీ భజ్జీకి బ్యాటింగ్ చేసేందుకు తగినన్ని అవకాశాలు రాలేదు. టాప్ ఆర్డర్ లేదంటే మిడిలార్డర్ ఎప్పుడూ పనికానిచ్చేది.
మరింత స్వింగ్ రాబట్టేలా కనిపించారని
పంజాబ్ బౌలింగ్ లైనప్ చూస్తే వారు మరింత స్వింగ్ రాబట్టేలా కనిపించారని అందుకే టెయిలెండర్లను ముందుగా పంపించానని మ్యాచ్ ముగిసిన తర్వాత ధోనీ వివరించాడు. సన్రైజర్స్ హైదరాబాద్, చెన్నై సూపర్ కింగ్స్ జట్లు మంగళవారం ముంబైలోని వాంఖడే స్టేడియం వేదికగా తలపడనున్నాయి.