
పోరాడిన స్నేహ్ రాణా
చివరి రోజు ఆటలో టీ విరామానికి భారత్ 8 వికెట్లకు 243 పరుగులతో కష్టాల్లో పడింది. కీలక బ్యాటర్లంతా పెవిలియన్ చేరారు.. ఓటమి తప్పదేమో అనిపించింది! కానీ ఎనిమిదో స్థానంలో వచ్చిన స్నేహ్ రాణా, పదో నంబర్ బ్యాటర్ తానియా భాటియా తో కలిసి అసాధారణంగా పోరాడింది.
ఒకవైపు ఓవర్లు కరిగిస్తూనే పరుగులు రాబట్టిన ఈ జోడీ చివరి సెషన్ అంతా వికెట్ చేజార్చుకోకుండా ఆడటంతో ఇంగ్లండ్కు నిరాశ తప్పలేదు. ఒక దశలో 171/2తో మెరుగైన స్థితిలో కనిపించింది. షెఫాలీవర్మ (63) ఔటైనా.. దీప్తిశర్మ (54), పూనమ్ రౌత్ (39) ఇన్నింగ్స్ను నడిపించారు. కానీ దీప్తి ఔటయ్యాక భారత పతనం ప్రారంభమైంది.

శతక భాగస్వామ్యం..
ఇంగ్లండ్ స్పిన్నర్లు ఎకిల్స్టోన్ (4/118), నటాలియా (2/21) విజృంభించడంతో భారత్ 28 పరుగుల తేడాతో 5 వికెట్లు కోల్పోయి 199/7తో కష్టాల్లో పడిపోయింది. కెప్టెన్ మిథాలీ రాజ్ (4), హర్మన్ ప్రీత్ (8) స్వల్ప స్కోర్లకే ఔట్ కాగా.. కాసేపు నిలిచిన శిఖా పాండే (18) కూడా వెనుదిరగడంతో భారత్ ఇన్నింగ్స్ ముగియడానికి ఎంతో సమయం పట్టదనిపించింది. కానీ అనూహ్యంగా ఎదురు నిలిచిన స్నేహ్-తానియా అబేధ్యమైన తొమ్మిదో వికెట్కు 104 పరుగులు జత చేసి జట్టును ఓటమి నుంచి బయటపడేశారు ఈ రెండు జట్ల మధ్య మూడు మ్యాచ్ల వన్డే సిరీస్ ఈనెల 27న మొదలవుతుంది.

సంక్షిప్త స్కోర్లు
ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్: 396/9 డిక్లేర్డ్
భారత్ తొలి ఇన్నింగ్స్: 231 ఆలౌట్
భారత్ రెండో ఇన్నింగ్స్: 344/8 (121 ఓవర్లలో)


Click it and Unblock the Notifications












