వన్డేల్లో కోహ్లీ 38వ సెంచరీ
ఈ మ్యాచ్లో కోహ్లీ మినహా మిగతా టాపార్డర్ బ్యాట్స్మన్ రోహిత్(8), ధావన్ (35), రాయుడు (22), పంత్ (24), ధోని(7)లు విఫలమయ్యారు. దీంతో భారత్ 194 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. దీంతో కోహ్లీ ఒంటరి పోరాటం చేస్తున్నాడు. లోయర్ ఆర్డర్ బ్యాట్స్మెన్తో కలిసి జట్టుకు విజయాన్నందించాలని పట్టుదలతో ఆడుతున్నాడు.
39 ఓవర్లకు భారత్ 207/5
మరోవైపు విండీస్ బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేస్తుండటంతో పోరు రసవత్తరంగా మారింది. ప్రస్తుతం 39 ఓవర్లలో భారత్ 5 వికెట్ల నష్టానికి 207 పరుగులు చేసింది. కోహ్లీ(103), భువనేశ్వర్ కుమార్(3) క్రీజులో ఉన్నారు. ఈ మ్యాచ్లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన విండీస్ 9 వికెట్లకు 283 పరుగులు చేసింది.
దేశం తరుపున వన్డేల్లో వరుసగా సెంచరీలు సాధించిన ఆటగాళ్లు:
5 బాబర్ అజాం in UAE, 2016-17
4 ఏబీ డివిలియర్స్ in Ind, 2010-11
4 విరాట్ కోహ్లీ in Ind, 2017-18
3 జహీర్ అబ్బాస్ in Pak, 1982-83
3 సయీద్ అన్వర్ in UAE, 1993
3 క్వింటన్ డీకాక్ in SA, 2013
3 కుమార సంగక్కర in Aus, 2015
భారత్ తరుపున విరాట్ కోహ్లీ గత నాలుగు ఇన్నింగ్స్లు:
113(106) v NZ, Kanpur
140(107) v WI, Gauhati
157(129)*v WI, Vizag
100(110)*v WI, Pune