|
టెస్టుల్లో ఓపెనర్గా
దీంతో పాటు టెస్టుల్లో ఓపెనర్గా అరంగేట్రం చేసి అత్యధిక పరుగులు సాధించిన క్రికెటర్గా కూడా రోహిత్ శర్మ నిలిచాడు. తొలి ఇన్నింగ్స్లో 176 పరుగులు చేసిన రోహిత్ శర్మ రెండో ఇన్నింగ్స్ 50 పరుగులు చేయడంతో మొత్తంగా ఈ టెస్టులో రోహిత్ శర్మ స్కోరు 226 పరుగులు దాటింది. ప్రస్తుతం 36 ఓవర్లకు గాను టీమిండియా 114/1 స్థితిలో ఉంది.
|
185 పరుగుల ఆధిక్యంలో
క్రీజులో రోహిత్ శర్మ(58), పుజారా(48) పరుగులతో ఉన్నారు. ప్రస్తుతం టీమిండియా 185 పరుగుల ఆధిక్యంలో కొనసాగుతోంది. దక్షిణాఫ్రికా తొలి ఇన్నింగ్స్లో 431 పరుగులకు ఆలౌట్ కాగా భారత జట్టు రెండో ఇన్నింగ్స్ ప్రారంభించింది. జట్టు స్కోరు 21 పరుగుల వద్ద టీమిండియా మయాంక్ అగర్వాల్ రూపంలో తొలి వికెట్ కోల్పోయింది.
|
7 పరుగులు చేసి ఔటైన మయాంక్
తొలి ఇన్నింగ్స్లో డబుల్ సెంచరీతో అద్భుత ప్రదర్శన చేసిన మయాంక్ అగర్వాల్ రెండో ఇన్నింగ్స్లో ఏడు పరుగులకే ఔటయ్యాడు. కేశవ్ మహారాజ్ బౌలింగ్లో స్లిప్లో డుప్లెసిస్కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్కు చేరాడు. ఈ దశలో క్రీజులోకి వచ్చిన పుజారాతో కలిసి రోహిత్ శర్మ ఇన్నింగ్స్ను చక్కదిద్దాడు. ఈ క్రమంలోనే రోహిత్ శర్మ హాఫ్ సెంచరీ సాధించాడు.