ఇప్పటి కుల్దీప్ వరకూ రెండు టెస్టుల్లో
కుల్దీప్ ఇప్పటి వరకూ కేవలం రెండు టెస్టుల్లో మాత్రమే ఆడాడు. జడేజా స్థానంలో చోటు దక్కించుకున్న కుల్దీప్.. గత ఏడాది లంకపై రెండు టెస్టులు ఆడాడు. అదనపు పేసర్లు అవసరం కావడంతో.. దక్షిణాఫ్రికా పర్యటనకు కుల్దీప్ను పక్కనబెట్టారు. జడేజా, అశ్విన్లను ఆ సిరీస్కు ఎంపిక చేశారు. కానీ ఆ సిరీస్లో బరిలో దిగే అవకాశం జడ్డూకు రాలేదు. అప్ఘాన్తో జరిగిన ఏకైక టెస్టులో ఆడిన జడేజా ఆరు వికెట్లు తీశాడు.
జడేజాను పక్కనబెట్టే అవకాశాలు కనిపిస్తున్నా
ప్రస్తుత ఫామ్ ప్రకారం.. ఇంగ్లాండ్తో ఐదు టెస్టుల సిరీస్కు జడేజాను పక్కనబెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. అతడి స్థానంలో కుల్దీప్ను బరిలో దిగడానికి ఎక్కువ ఛాన్స్ ఉంది. ఒకవేళ జడ్డూ మెరుగ్గా బ్యాటింగ్ చేస్తాడని భావిస్తే మాత్రం అశ్విన్పై వేటు పడే ప్రమాదం ఉంది.
కార్తీక్ స్థానంలో రైనాను తీసుకుంటున్న విషయం
మరో పక్క కార్తీక్ స్థానంలో రైనాను తీసుకుంటున్న విషయంపై టీమిండియా అసిస్టెంట్ కోచ్ సంజయ్ బంగర్ వివరణ ఇచ్చాడు. 'మిడిలార్డర్లో ఎడమ చేతి బ్యాట్స్మెన్ను ఆడించాలని ప్లాన్ చేసుకున్నాం. ఇందులో భాగంగానే దినేశ్ను కాదని రైనాకు అవకాశం ఇస్తున్నాం. వచ్చే ఏడాది జరిగే ప్రపంచకప్కు ముందు భారత్ పదిహేనుకు పైగా వన్డేలు ఆడనుంది. ఈ వన్డేల ద్వారా పలువురి ఆటగాళ్లకు అవకాశం ఇచ్చి మిడిలార్డర్ను బలోపేతం చేయడానికి ప్రయత్నిస్తాం' అని చెప్పాడు.
టీమిండియా బెంచ్ను మరింత బలంగా
'ఇప్పుడు బ్యాటింగ్ చేస్తున్న ఆటగాళ్లు భవిష్యత్తులో అదే స్థానంలో తప్పనిసరిగా బ్యాటింగ్ చేస్తారని చెప్పలేను. వారి స్థానాల్లో మార్పులు చోటు చేసుకోవచ్చు. వరల్డ్ కప్ నాటికి టీమిండియా బెంచ్ను మరింత బలంగా తయారు చేసుకునేందుకే ఈ ప్రయత్నాలు' అని బంగర్ పేర్కొన్నాడు.