టెస్టు క్రికెట్లోకి అరంగేట్రం చేసిన ఏడాదిలోనే
అంతేకాదు టెస్టు క్రికెట్లోకి అరంగేట్రం చేసిన ఏడాదిలోనే అత్యధిక వికెట్లు పడగొట్టిన భారత తొలి బౌలర్గా బుమ్రా చరిత్ర సృష్టించిన సంగతి తెలిసిందే. అరంగేట్ర ఏడాదిలో అత్యధిక టెస్టు వికెట్లు తీసిన మూడో బౌలర్ బుమ్రా (48). టెర్రీ ఆల్డర్మన్ (1981లో 54), ఆంబ్రోస్ (1988లో 49) బుమ్రా కంటే ముందు ఉన్నారు.
ఆస్ట్రేలియా గడ్డపై ఓ టెస్టులో
దీంతో పాటు ఆస్ట్రేలియా గడ్డపై ఓ టెస్టులో ఉత్తమ గణాంకాలు నమోదు చేసిన పేసర్గా కపిల్ (8/109)ను మెల్ బోర్న్ టెస్టులో బుమ్రా (9/86) అధిగమించాడు. 2018లో మొత్తం 9 టెస్టులాడిన జస్ప్రీత్ బుమ్రా ఏకంగా 48 వికెట్లను తన ఖాతాలో వేసుకున్నాడు. దీంతో బుమ్రాపై సచిన్ టెండూల్కర్, సునీల్ గవాస్కర్, సౌరవ్ గంగూలీ తదితరులు ప్రశంసలు కురిపించారు.
సీఏకు మరో షాక్: మెల్బోర్న్ పిచ్కి ఐసీసీ ‘యావరేజ్' రేటింగ్
ఆసీస్ గడ్డపై టెస్టుల్లో బుమ్రా ప్రదర్శన అద్భుతం
తాజాగా, ఈ జాబితాలోకి మాజీ కెప్టెన్ కపిల్దేవ్ కూడా చేరాడు. ఓ జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్యూలో జస్ప్రీత్ బుమ్రా గురించి మాట్లాడుతూ "జస్ప్రీత్ బుమ్రా క్రికెట్లోకి వచ్చిన కొత్తలో.. అతని బౌలింగ్ శైలిని చూసి ఎక్కువకాలం కొనసాగలేడని అనుకున్నా. నా అంచనా తప్పని అతను తన ప్రదర్శనతో నిరూపించాడు. ఆస్ట్రేలియా గడ్డపై టెస్టుల్లో అతని ప్రదర్శన అద్భుతం" అని అన్నాడు.
మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు అందుకున్న బుమ్రా
బాక్సిండ్ డే టెస్టులో టీమిండియా విజయం సాధించడంలో కీలకపాత్ర పోషించిన బుమ్రా మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డుని సైతం అందుకున్నాడు. కాగా, ఈ సిరిస్లో చివరిదైన నాలుగు టెస్టు జనవరి 3 నుంచి సిడ్నీ వేదికగా జరగనుంది. ఈ సిరిస్ అనంతరం ఇరు జట్ల మధ్య జనవరి 12 నుంచి మూడు వన్డేల సిరిస్ ప్రారంభం కానుంది.