ముంబైతో జరిగిన మ్యాచ్లో 73 పరుగులు చేసిన పాండ్యా
ముంబైతో జరిగిన తొలి మ్యాచ్లోనే బ్యాట్తో 137 బంతుల్లో 8 ఫోర్లు, ఒక సిక్సు సాయంతో 73 పరుగులు చేసిన హార్దిక్ పాండ్యా అటు బౌలింగ్లోనూ సత్తాచాటాడు. తొలి ఇన్నింగ్స్లో ఐదు వికెట్లు, రెండో ఇన్నింగ్స్లో రెండు వికెట్లు పడగొట్టి తిరిగి మునుపటి ఫామ్ను అందుకున్నాడు.
‘బాక్సింగ్ డే’ టెస్టుకి పాండ్యాను ఎంపిక చేయాలని
దీంతో ఆస్ట్రేలియాతో ‘బాక్సింగ్ డే' టెస్టుకి పాండ్యాను ఎంపిక చేయాలని సెలక్టర్లు యోచిస్తున్నట్లు తెలుస్తోంది. నాలుగు టెస్టు మ్యాచ్ల సిరిస్లో భాగంగా అడిలైడ్ వేదికగా జరిగిన తొలి టెస్టులో టీమిండియా 31 పరుగులతో విజయం సాధించిన సంగతి తెలిసిందే. దీంతో ఈ సిరిస్లో టీమిండియా 1-0 ఆధిక్యంలో నిలిచింది.
|
టీమిండియా విజయ లక్ష్యం 287
పెర్త్ వేదికగా జరుగుతున్న రెండో టస్టులో ఆస్ట్రేలియా 287 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. నాలుగోరోజైన సోమవారం ఓవర్నైట్ స్కోరు 132/4తో రెండో ఇన్నింగ్స్ని కొనసాగించిన ఆస్ట్రేలియా జట్టు 243 పరుగులు చేసి ఆలౌటైంది. దీంతో తొలి ఇన్నింగ్స్లో లభించిన 43 పరుగుల ఆధిక్యాన్ని కలుపుకుని మొత్తం 287 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది.
పెర్త్ టెస్టు ఫలితం ఎలా ఉండబోతుందోనని ఆసక్తికరం
ఆస్ట్రేలియా గడ్డపై టీమిండియా ఇప్పటివరకు ఇంతటి పెద్ద లక్ష్యాన్ని చేధించిన దాఖలా లేదు. దీంతో పెర్త్ టెస్టు ఫలితం ఎలా ఉండబోతుందోనని ఆసక్తికరంగా మారింది. మరోవైపు పచ్చికతో కూడిన పిచ్ క్రమంగా బ్యాటింగ్కి కష్టంగా మారడం విశేషం. మంగళవారం ముగియనున్న రెండో టెస్టులో భారత్ విజయం సాధిస్తుందా? లేక డ్రా చేసుకుంటుందా? అనేది తెలియాలి.