|
ప్రతికూలంగా జరగనప్పుడు ఎలా ప్రవర్తించాలో
దాంతో పాటు విరాట్ వ్యవహారశైలిపై భిన్నంగా రాసుకొచ్చాడు. ‘మైదానంలో మనకు ప్రతికూలంగా జరగనప్పుడు ఎలా ప్రవర్తించాలో కోహ్లీ మనకు చూపిస్తున్నాడు' అని క్యాప్షన్ ఇచ్చి వీడియో ట్వీట్ చేశాడు. దీంతో ఈ ట్వీట్ వైరల్ అవుతోంది. జర్నలిస్ట్పై భారత అభిమానులు తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు.
|
వార్నర్ వీడియో కూడా పెట్టి ఉంటే
‘డేవిడ్ వార్నర్ మైదానంలో ఇలాగే ప్రవర్తించేవాడు. తన వీడియో కూడా పెట్టి ఉంటే బావుండేది' అని, ‘కోహ్లీ ఎప్పుడైనా బ్యాటు నేలకేసి కొట్టడం, కుర్చీలను తన్నడం మీరు చూశారా?' అని డెన్నిస్ను తిడుతూ కామెంట్లు పెడుతున్నారు. రిక్కీ పాంటింగ్ మోటెరా క్రికెట్ స్టేడియం వేదికగా 2011 ప్రపంచ కప్ జింబాబ్వే వర్సెస్ ఆస్ట్రేలియా మ్యాచ్ కథనం గుర్తులేదా. కేవలం ఆసీస్ 250 పరుగులు మాత్రమే చేసిందని పాంటింగ్ ఓ టీవీని బద్ధలుకొట్టాడు. శాండ్పేపర్ వాడే జట్ల కంటే ఏం తీసిపోలేదులెమ్మంటూ మరో నెటిజన్ ట్వీట్కు కౌంటర్ ఇచ్చే ప్రయత్నం చేశాడు.
వాళ్లకు లేని.... వీళ్లకు కావాలా
నిజానికి కోహ్లీ ఆసీస్ కెప్టెన్తో మాట్లాడుతూ.. ఇలా చేస్తే మీరు సిరీస్లో 2-0తేడాతో ఓడిపోతారంటూ కవ్వించే ప్రయత్నం చేశాడు. దానికి స్పందించిన టిమ్ అదే స్థాయిలో స్పందించి రెండ్రోజుల పాటు వాదనకు రమ్మంటూ కోహ్లీని రెచ్చగొట్టాడు. వాటికి సానుకూలంగానే స్పందించిన కోహ్లీ మౌనం పాటించాడు. ఆ తర్వాత ఆసీస్ మీడియా వ్యతిరేక కథనాల వల్ల కోహ్లీ ప్రవర్తనపై వివరణ కావాలంటూ బీసీసీఐని కోరింది ఆస్ట్రేలియా క్రికెట్. ఇది కేవలం ఆటలో భాగమే కానీ, వ్యక్తిగత దూషణ ఏం లేదంటూ ఇరు దేశాల క్రికెట్ బోర్డులతో పాటు ఆసీస్-భారత్లు కూడా పట్టించుకోవడం మానేశాయి. డిసెంబరు 26న జరగనున్న బాక్సింగ్ డే టెస్టు కోసం సన్నద్ధమవుతున్నాయి.