కోహ్లీ ప్రస్తుతం నేర్చుకునే దశలో
‘ఏ ఆటగాడూ లేదా ఏ కెప్టెనూ పూర్తిగా అన్నీ తెలిసిన వాళ్లనికాదనేది నా అభిప్రాయం. విరాట్ కోహ్లీ కూడా ప్రస్తుతం నేర్చుకునే దశలోనే ఉన్నాడు. ఆటగాళ్లు ఎంత ప్రాక్టీస్ చేస్తే ఆట అంత బాగా అడగలరు. ఎన్ని మ్యాచ్లు ఆడితే వారికంత అనుభవం చేకూరుతుంది. దక్షిణాఫ్రికాతో మ్యాచ్ల నుంచి మొన్నటి వెస్టిండీస్ మ్యాచ్ల వరకు ప్రతీది టీమిండియాకొక అనుభవం లాంటిదే.
ఇంగ్లాండ్తో మ్యాచ్ల నుంచి నేర్చుకున్నాడని
కోహ్లీ విషయానికొస్తే ఇంగ్లాండ్తో మ్యాచ్ల నుంచి అతడెంతో నేర్చుకున్నాడని అనుకుంటున్నాను. నాకు తెలిసి ప్రస్తుత పరిస్థితుల్లో బౌలింగ్ విభాగంలో ఆసీస్ కంటే టీమిండియానే మెరుగ్గా ఉంది. అయితే ఆసీస్ లోయర్ ఆర్డర్ పట్ల టీమిండియా చాలా అప్రమత్తంగా ఉండాలి. ఎందుకుంటే ఇంతకుముందు లోయర్ ఆర్డర్ బ్యాట్స్మెన్స్ టీమిండియాను రెండు సార్లు దెబ్బకొట్టారు. మరోసారి ఆ అవకాశం వారికివ్వకూడదు.
టీమిండియాకేమంత కష్టం కాదు
ఆసీస్ సొంత గడ్డపై వారికే ఎక్కువ పరిజ్ఞానం ఉంటుంది. టీమిండియా పిచ్ పరిస్థితులను సరిగ్గా అంచనా వేయగలగాలి. వీటన్నింటినీ దృష్టిలో ఉంచుకుంటే గెలవడం టీమిండియాకేమంత కష్టం కాదు' అని విశ్లేషించారు.
కుంబ్లే అలా తప్పుకున్నాడు:
ధర్మశాలలో జరిగిన చివరి టెస్టులో కోహ్లీకి సమాచారం లేకుండానే చైనామన్ స్పిన్నర్ కుల్దీప్ను కుంబ్లే జట్టులోకి తీసుకున్నట్టు వార్తలు రావడం కలకలం రేపింది.
ఈ దశలో పొరపొచ్చాలున్నా కోచ్గా కుంబ్లే కొనసాగాడు. అయితే, చాంపియన్స్ ట్రోఫీలో లీగ్దశలో అదరగొట్టిన భారత్.. ఫైనల్లో పాకిస్థాన్ చేతిలో చిత్తయింది. మ్యాచ్ ఓడిన తర్వాత జట్టును ఉద్దేశించి కుంబ్లే మాట్లాడిన తీరుతో సంబంధాలు పూర్తిగా దెబ్బతిన్నాయి. తదనంతరం కాంట్రాక్ట్ పొడిగింపు కోసం కుంబ్లే బోర్డుకు దరఖాస్తు కూడా చేయలేదు.