Test, ODI, T20I: తొలి భారత క్రికెటర్గా రోహిత్ శర్మ అరుదైన రికార్డు
తాజాగా సచిన్ టెండూల్కర్ మాట్లాడుతూ... 'ఏదైనా ఆలోచన ధోరణి బట్టి ఉంటుంది. టెస్టుల్లో ఓపెనింగ్ చేయాలంటే భిన్నమైన ఆలోచన ధోరణి ఉండాలి. సెహ్వాగ్ ఆలోచన విధానం విభిన్నంగా ఉంటుంది. వన్డే, టెస్టు వీరు ఒకేలా ఆడతాడు. దూకుడే అతడి నైజం. ఇన్నింగ్స్ తొలి బంతి నుంచే బౌండరీలు కొట్టాలనుకుంటాడు. ఆలోచన ధోరణి ఆటగాడి సామర్థ్యం, బలాలపై ఆధారపడి ఉంటుంది. సెహ్వాగ్లా దూకుడుగా ఆడే ఆటగాళ్లు ఎంతో మంది ఉంటారు. కానీ.. అతడిలా నిలకడగా రాణించాలి. వీరు సరైన ఓపెనర్' అని అన్నాడు.
'ఇంగ్లాండ్లో ఓపెనర్గా ఆడిన తొలి మ్యాచ్లోనే సెహ్వాగ్ సెంచరీ చేసాడు. అది అతని కెరీర్కు ఎంతో ఉపయోగపడింది. సెహ్వాగ్ కొన్ని కఠిన పరిస్థితులను కూడా ఎదుర్కొన్నాడు. నిలకడ అనేది ఆటలో చాలా ముఖ్యం. టెస్టుల్లో రోహిత్ ఓపెనర్గా ఎలా రాణిస్తాడో వేచిచూడాలి. టీమిండియాకు రోహిత్ మరో సెహ్వాగ్ అవ్వాలంటే దూకుడుతో పాటు ఆటలో నిలకడ చూపించాలి' అని సచిన్ పేర్కొన్నాడు.
'సీనియర్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ టాప్ బౌలర్. కేవలం బంతితోనే కాదు కీలకమైన పరుగులు చేసి జట్టును ఎన్నోసార్లు ఆదుకున్నాడు. భారత జట్టులో అతడు కీలక సభ్యుడు. ఇందులో ఎలాంటి సందేహం లేదు. ప్రతి ఆటగాడి కెరీర్లో ఎత్తుపల్లాలు సహజం. అశ్విన్ సుదీర్ఘకాలంగా జట్టుతో ఉన్నాడు. తన ఏంటో ఇప్పటికే నిరూపించుకున్నాడు. నా వరకైతే అతడు భారత జట్టులో అంతర్భాగం' అని తెలిపాడు.