ఆ టైమ్ లో కోహ్లీ ముఖం చూడాలి
ఐపీఎల్ లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు విజయాల పరంపరకు బ్రేక్ పడింది. గురువారం రాత్రి అహ్మదాబాద్ నరేంద్ర మోదీ స్టేడియంలో గుజరాత్ టైటాన్స్ నాలుగు వికెట్ల తేడాతో ఆర్సీబీపై గెలుపొందింది. శుభ్మన్ గిల్ (43), జోస్ బట్లర్ (39) మెరుపు ఇన్నింగ్స్లతో జీటీ 155 పరుగుల లక్ష్యాన్ని 15.5 ఓవర్లలో ఛేదించింది. ఆర్సీబీ బౌలర్ భువనేశ్వర్ కుమార్ మూడు వికెట్లు తీసినా లాభం లేకపోయింది. జేసన్ హోల్డర్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డును అందుకున్నాడు.
తొలుత బ్యాటింగ్ కు దిగిన ఆర్సీబీ 19.2 ఓవర్లలో 155 పరుగులకే ఆలౌటయింది. విరాట్ కోహ్లి 13 బంతుల్లో 28 పరుగులు చేసి కగిసో రబాడ ఓవర్లో ఐదు ఫోర్లతో మెరుపు ఆరంభం ఇచ్చినా, దాన్ని భారీ ఇన్నింగ్ గా మలచుకోలేకపోయిందా జట్టు. మిగిలిన బ్యాటర్లెవరూ పెద్దగా రాణించలేదు. దేవ్దత్ పడిక్కల్ 40 పరుగులు చేసినా జట్టును పతనం నుంచి ఆదుకోలేకపోయాడు. అతనికి సహకారాన్ని అందించేవారు కరవయ్యారు. దీంతో ఆర్సీబీ మిడిల్ ఆర్డర్ కుప్పకూలింది.

గుజరాత్ టైటాన్స్ ఇన్నింగ్ లో అర్షద్ ఖాన్ 3/22, రషీద్ ఖాన్ 2/19, జేసన్ హోల్డర్ 2/29 (మూడు క్యాచ్లతో) రాణించారు. ఆర్సీబీని 155 పరుగులకే కట్టడి చేశారు. ఈ మ్యాచ్ రసవత్తరంగా సాగిందనడానికి విరాట్ కోహ్లీ ఎక్స్ ప్రెషన్స్ ఉదాహరణగా చెప్పుకోవచ్చు. శుభ్మన్ గిల్ క్యాచ్ పట్టిన తర్వాత ఫియరీ రియాక్షన్ ఇచ్చాడు కోహ్లీ. అయిదో ఓవర్ చివరి బంతికి గిల్ కవర్ మీదుగా షాట్ ఆడబోగా.. కోహ్లి మెరుపువేగంతో ఆ బంతిని అందుకున్నాడు.
క్యాచ్ పట్టిన వెంటనే కోహ్లీ.. గిల్ను గుచ్చిగుచ్చి చూశాడు. ఆవేశంగా డెత్ స్టేర్ ఇచ్చాడు. బంతిని నేలకేసి బలంగా కొట్టాడు. అతని దూకుడు మ్యాచ్ను హై-వెలాసిటీలోకి తీసుకెళ్లింది. రసవత్తరంగా మార్చింది. ఆ తర్వాత కూడా కోహ్లీ కొన్ని సరదా రియాక్షన్లు ఇవ్వడం కనిపించింది. అయినప్పటికీ ఫైనల్ రిజల్ట్ మాత్రం వ్యతిరేకంగానే రావడం విరాట్ కోహ్లీని తీవ్రంగా నిరాశపరిచింది కూడా. శుభ్మన్ గిల్, సాయి సుదర్శన్ వికెట్లు త్వరగా పడిపోయినా గుజరాత్ టైటాన్స్ పట్టు నిలుపుకొంది. 25 బంతులు మిగిలి ఉండగానే 4 వికెట్ల తేడాతో ఈ మ్యాచ్ను గెలుచుకుంది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications