— Cricsphere (Cricsphere) November 26, 2021 |
పంత్కు విశ్రాంతివ్వడంతో..
రెగ్యులర్ వికెట్ కీపర్ రిషభ్ పంత్కు విశ్రాంతి ఇవ్వడంతో వృద్దీమాన్ సాహా, కేఎస్ భరత్లను ఈ సిరీస్కు ఎంపిక చేశారు. అయితే ఫస్ట్ టెస్ట్లో కేఎస్ భరత్కు చోటు దక్కుతుందని అంతా భావించినా.. టీమ్మేనేజ్మెంట్ సీనియర్ వికెట్ కీపర్ వృద్దీమాన్ సాహాకే అవకాశం ఇచ్చింది. అయితే ఈ అవకాశాన్ని సాహా సద్వినియోగం చేసుకోలేకపోయాడు. నిర్లక్ష్యంగా వికెట్ పారేసుకున్నాడు. అతను గనుక ఓ 30-40 పరుగులు చేసినా టీమిండియాకు భారీ స్కోర్ లభించేదని కామెంట్ చేస్తున్నారు. 12 బంతులు ఎదుర్కొన్న సాహా.. తీవ్రంగా ఇబ్బంది పడ్డాడని, అతని పనైపోయిందని కామెంట్ చేస్తున్నారు.
|
కేఎస్ భరత్ తీసుకోండి..
ఈ నేపథ్యంలో సాహా ఆట తీరుపై నెటిజన్లు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. ఇప్పటికైనా సాహాను జట్టు నుంచి తప్పించి అతని స్థానంలో కేఎస్ భరత్ను ఎంపిక చేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు. ''ఏం ఆడుతున్నావయ్యా! ఆటపై కాస్త దృష్టి పెట్టు! సాహాను ఇంకా జట్టులో కొనసాగించడం ఎందుకు? మా తెలుగోడి అవకాశమివ్వండయ్యా.. ఇప్పటికైనా అతన్ని కాదని రిషభ్ పంత్ను ఎందుకు తీసుకుంటారో అర్థమవుతోందా! సాహా ఫామ్లో లేడు కదా! బైబై చెప్పేయండి! సాహాకు బదులు కేఎస్ భరత్ను జట్టులోకి తీసుకోండి.' అని ట్రోల్ చేస్తున్నారు.
|
భారత్ 345 ఆలౌట్..
న్యూజిలాండ్తో జరుగుతున్న తొలి టెస్టులో టీమిండియా 345 పరుగులకు ఆలౌట్ అయ్యింది. 111.1 ఓవర్ల వద్ద తొలి ఇన్నింగ్స్ను ముగించింది. 258/4 ఓవర్నైట్ స్కోరుతో రెండో రోజు ఆటను మొదలెట్టిన టీమిండియా కివీస్ బౌలర్ టిమ్ సౌథీ దెబ్బతీశాడు. అర్ధ సెంచరీ సాధించిన జడేజా.. ఆ తర్వాత సాహా, సెంచరీ హీరో శ్రేయస్ అయ్యర్, అక్షర్ పటేల్ వికెట్లను తన ఖాతాలో వేసుకున్నాడు. మరో బౌలర్ అజాజ్ పటేల్ అశ్విన్, ఇషాంత్ శర్మలను పెవిలియన్కు పంపి లాంఛనం పూర్తి చేశాడు.