|
కోహ్లీ సలహాతోనే..
ఈ వికెట్ అనంతరం విరాట్ కోహ్లీ, హార్దిక్ పాండ్యా, శార్దూల్ ఠాకూర్ ఒకరినొకరు నవ్వుకున్నారు. అయితే వికెట్ తీసిన ఆనందంలో అలా చేసి ఉంటారని అంతా అనుకున్నారు. కానీ తమ వ్యూహంలో టామ్ లాథమ్ చిక్కుకున్నాడనే అలా సెలెబ్రేట్ చేసుకున్నట్లు తాజాగా తెలిసింది. మ్యాచ్ అనంతరం మీడియాతో మాట్లాడిన కెప్టెన్ రోహిత్ శర్మ ఈ విషయాన్ని తెలియజేశాడు. రోహిత్, హార్దిక్ కలిసి.. టామ్ లాథమ్ను శార్దూల్తో బోల్తా కొట్టించారని, నకుల్ బాల్ వేయాలనే ఆలోచిన వారిదేనని పేర్కొన్నాడు.
నకుల్ బాల్ వేయాలంటూ..
'శార్దూల్ ఠాకూర్ అద్భుతమైన నకుల్ బాల్తో టామ్ లాథమ్ను ఔట్ చేశాడు. ఇన్నింగ్స్ మిడిల్లో లాథమ్ వికెట్ కోసం విరాట్ కోహ్లీ, హార్దిక్ పాండ్యా కలిసి శార్దూల్తో అద్భుతమైన ప్రణాళిక రచించారు. ఆ ప్లాన్ అద్భుతంగా వర్కౌటైంది'అని రోహిత్ చెప్పుకొచ్చాడు. దాంతో ఈ వికెట్ వ్యూహాన్ని అర్థం చేసుకున్న ఫ్యాన్స్ విరాట్ కోహ్లీపై ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. న్యూజిలాండ్ ఇన్నింగ్స్ 26వ ఓవర్లో శార్దూల్ వరుస బంతుల్లో రెండు వికెట్లు తీసాడు. ముందుగా క్రీజులో సెట్ అయిన డారిల్ మిచెల్ను షార్ట్ పిచ్బాల్తో పెవిలియన్ చేర్చిన శార్దూల్ ఠాకూర్.. మరుసటి బంతికే నకల్ బాల్తో లాథమ్ను బోల్తా కొట్టించాడు.
శతక్కొట్టిన రోహిత్, శుభ్మన్ గిల్..
ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్లకు 385 పరుగులు చేసింది. రోహిత్ శర్మ(85 బంతుల్లో 9 ఫోర్లు, 6 సిక్స్లతో 101), శుభ్మన్ గిల్(78 బంతుల్లో 13 ఫోర్లు, 5 సిక్స్లతో 113) సెంచరీతో చెలరేగగా... హార్దిక్ పాండ్యా(38 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్సర్లతో 54) హాఫ్ సెంచరీతో మెరిసాడు. న్యూజిలాండ్ బౌలర్లలో జకోబ్ డఫ్ఫీ, బ్లెయిర్ టిక్నర్ మూడు వికెట్లు తీయగా.. మైఖేల్ బ్రేస్వెల్ ఓ వికెట్ పడగొట్టాడు.
అనంతరం లక్ష్యచేధనకు దిగిన న్యూజిలాండ్ 41.2 ఓవర్లలో 295 పరుగులకు కుప్పకూలింది. డెవాన్ కాన్వే(100 బంతుల్లో12 ఫోర్లు, 8 సిక్స్లతో 138) సెంచరీతో చెలరేగినా ఫలితం లేకపోయింది. హెన్రీ నికోల్స్(42) మినహా మరే బ్యాటర్ రాణించలేదు. భారత బౌలర్లలో శార్దూల్ ఠాకూర్, కుల్దీప్ యాదవ్ మూడేసి వికెట్లు తీయగా.. చాహల్ రెండు వికెట్లు పడగొట్టాడు. హార్దిక్ పాండ్యా, ఉమ్రాన్ మాలిక్ చెరొక వికెట్ తీసారు.