రాయ్పూర్: భారత్-న్యూజిలాండ్ మధ్య జరుగుతున్న రెండో వన్డేలో ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. ఓ అభిమాని సెక్యూరిటీ కళ్లు గప్పి మైదానంలోకి దూసుకొచ్చాడు. తన అభిమాన క్రికెటర్ అయిన రోహిత్ శర్మ గట్టిగా హగ్ చేసుకున్నాడు. ఈ ఊహించని ఘటనతో షాక్కు గురైన భద్రతా సిబ్బంది.. వెంటనే అప్రమత్తమై ఆ అభిమానిని మైదానం నుంచి తీసుకెళ్లారు. దాంతో మ్యాచ్ కాసేపు నిలిచి పోయింది. అయితే మైదానంలోకి దూసుకొచ్చిన ఆ అభిమాని ఓ 12 ఏళ్ల బాలుడు కావడం విశేషం.
Rohit Sharma stopped security and he said "he's a kid, let him go" - This is great gesture from Hitman Rohit Sharma. pic.twitter.com/QV6RMRHlQt
— CricketMAN2 (@ImTanujSingh) January 21, 2023
రోహిత్ శర్మను పిచ్చిగా అభిమానించే ఆ కుర్రాడు.. తన ఆరాధ్య క్రికెటర్ను ఎలాగైన కలవాలనే ఉద్దేశంతో సాహసం చేశాడు. ఇక ఆ కుర్రాడిని వదిలేయాని రోహిత్ శర్మ సెక్యూరిటీకి సూచించడం టీవీ కెమెరాల్లో కనిపించింది. రోహిత్ శర్మ చేసిన పనికి ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. భారత్ ఇన్నింగ్స్ సందర్భంగా బ్లెయిర్ టిక్నెర్ వేసిన 10వ ఓవర్లో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ఓవర్ నాలుగో బంతిని రోహిత్ సిక్సర్ బాదగా.. అనంతరం ఆ బాలుడు మైదానంలోకి దూసుకొచ్చాడు. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియో, ఫొటోలు నెట్టింట వైరల్గా మారాయి.
Craze of Hitman Rohit Sharma! pic.twitter.com/zTPYaUFVsC
— CricketMAN2 (@ImTanujSingh) January 21, 2023
ఈ మ్యాచ్లో భారత బౌలర్లు మహమ్మద్ షమీ(3/18), హార్దిక్ పాండ్యా(2/16), వాషింగ్టన్ సుందర్(2/7) విజృంభించడంతో న్యూజిలాండ్ 34.3 ఓవర్లలోనే 108 పరుగులకే కుప్పకూలింది. గ్లేన్ ఫిలిప్స్(52 బంతుల్లో 5 ఫోర్లతో 36), మైకేల్ బ్రేస్వెల్(30 బంతుల్లో 4 ఫోర్లతో 22) టాప్ స్కోరర్లుగా నిలిచారు. సిరాజ్, ఠాకూర్, కుల్దీప్ యాదవ్కు తలో వికెట్ తీసారు.
Rohit Sharma told the security - "let him go, he's a kid".
— Mufaddal Vohra (@mufaddal_vohra) January 21, 2023
Great gesture by the captain! pic.twitter.com/7Gz6nDHsV3
అనంతరం లక్ష్య చేధనకు దిగిన టీమిండియా విజయం దిశగా దూసుకెళ్తోంది. న్యూజిలాండ్ బ్యాటర్లు తడబడిన వికెట్పై భారత ఓపెనర్లు స్వేచ్చగా ఆడారు. ముఖ్యంగా రోహిత్ శర్మ తనకే సాధ్యమైన ట్రేడ్ మార్క్ షాట్లతో కివీస్ బౌలర్లపై విరుచుకుపడ్డాడు. 47 బంతుల్లో 7 ఫోర్లు, 2 సిక్స్ల సాయంతో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. హాఫ్ సెంచరీ అనంతరం షిప్లే బౌలింగ్లో రోహిత్ ఎల్బీగా వెనుదిరిగాడు. దాంతో తొలి వికెట్కు నమోదైన 72 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. క్రీజులోకి వచ్చిన విరాట్ కోహ్లీతో శుభ్మన్ ఇన్నింగ్స్ నడపిస్తున్నాడు.