ఓవర్లోని ఆరు బంతుల్ని ఆరు విధాలుగా
దీనిపై స్పందించిన గంగూలీ ఓవర్లోని ఆరు బంతుల్ని ఆరు విధాలుగా వేయాలన్న తపనతోనే ఆ టెస్టులో అశ్విన్ ఫెయిలయ్యాడని తెలిపాడు. ఫాస్ట్ బౌలర్లు పిచ్పై పగుళ్లు, గరుకు ఏర్పడేలా చేసినప్పటికీ, వాటిని అశ్విన్ వినియోగించుకోకుండా దుస్రా, లెగ్స్పిన్ వికెట్ల కోసం ప్రయత్నించాడని గంగూలీ మండిపడ్డాడు.
ఓవల్ వేదికగా శుక్రవారం నుంచి ఆఖరి టెస్టు
ఇరు జట్ల మధ్య ఈ సిరిస్లో ఆఖరి టెస్టు శుక్రవారం ఓవల్ వేదికగా ఆరంభం కానుంది. ఈ నేపథ్యంలో సౌరవ్ గంగూలీ ఓ జాతీయ ఛానెల్కు ఇచ్చిన ఇంటర్యూలో "మైదానంలో అశ్విన్ ఎందుకంత అసహనంతో ఉంటున్నాడో? కెప్టెన్ విరాట్ కోహ్లీ మాట్లాడి తెలుసుకోవాలి. అతను ప్రతిసారీ.. ఓవర్లోని ఆరు బంతుల్నీ.. భిన్నంగా వేసేందుకు ప్రయత్నిస్తున్నాడు" అని అన్నాడు.
నేను కెప్టెన్గా ఉన్నప్పుడు
"భారత్ వెలుపల టెస్టులు ఆడేటప్పుడు.. ఫాస్ట్ బౌలర్లు ఏర్పరిచే పగుళ్లు, గరుకు పిచ్లను ఆఫ్ స్పిన్నర్ వినియోగించుకోవాలి. నేను కెప్టెన్గా ఉన్నప్పుడు.. పిచ్ గరుకుగా కనిపిస్తే.. లెగ్ స్పిన్నర్ అనిల్ కుంబ్లేకి బదులుగా హర్భజన్ సింగ్తో బౌలింగ్ చేయించేవాడ్ని. నాలుగో టెస్టులో 9 వికెట్లు పడగొట్టిన మొయిన్ అలీ.. అశ్విన్ కంటే మెరుగైన బౌలరేమీ కాదు" అని గంగూలీ అన్నాడు.
దూస్రా, రాంగ్ ఆన్, లెగ్స్పిన్ బౌలింగ్తో
"అయితే, అతడు గరుకు పిచ్ని చక్కగా వినియోగించుకున్నాడు. మరోవైపు అశ్విన్ మాత్రం.. దూస్రా, రాంగ్ ఆన్, లెగ్స్పిన్ బౌలింగ్తో వికెట్ల కోసం ప్రయత్నించాడు. ఒకే తరహాలో టెస్టుల్లో బౌలింగ్ చేస్తుంటే విసుగు వస్తుంది. కానీ, ఆ టెక్నిక్ మ్యాచ్లను గెలిపించలేవు" అని సౌరవ్ గంగూలీ తెలిపాడు.