డబ్ల్యూటీసీ ఫైనల్ చేరాలంటే..?
వరల్డ్ టెస్ట్ చాంపియన్షిప్ గెలవాలంటే ఈ సిరీస్ గెలవడం టీమిండియాకు చాలా ముఖ్యం. మరోవైపు 2004 నుంచి సొంతగడ్డపై భారత్ను ఓడించలేకపోతున్న ఆసీస్.. ఈ సారి ఎలాగైనా ఆ ముచ్చట తీర్చుకోవాలనుకుంటోంది. దాంతో ఈ సిరీస్పై సర్వత్రా ఆసక్తి నెలకొంది. తొలి టెస్ట్లోనే విజయం సాధిస్తే టీమ్ ఆత్మవిశ్వాసం పెరగనుంది. ఈ క్రమంలోనే ఇరు జట్లు తొలి టెస్ట్లోనే విజయం సాధించాలనే పట్టుదలతో ఉన్నాయి.
తలనొప్పిగా..
టీమిండియా కాంబినేషన్ హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్, కెప్టెన్ రోహిత్ శర్మలకు తలనొప్పిగా మారింది. యువ ఓపెనర్ శుభ్మన్ గిల్ వరుస సెంచరీలతో సూపర్ ఫామ్లో ఉండటం.. శ్రేయస్ అయ్యర్ గాయంతో తొలి టెస్ట్కు దూరమవ్వడంతో జట్టులోకి ఎవర్ని తీసుకోవాలనేదానిపై ఎటూ తేల్చుకోలేకపోతుంది. వైస్ కెప్టెన్ కేఎల్ రాహుల్ రోల్ విషయంలోనూ టీమ్మేనేజ్మెంట్కు క్లారిటీ లేదు. అతన్ని ఓపెనర్గా ఆడించాలా? లేకుంటే మిడిలార్డర్లో దించాలా? అనేది కూడా తేల్చుకోవాల్సి ఉంది. రోడ్డు ప్రమాదంతో జట్టుకు దూరమైన రిషభ్ పంత్ స్థానంలో కేఎస్ భరత్ను ఆడించాలా? అటాకింగ్ గేమ్ ఆడే ఇషాన్ కిషన్కు అవకాశం ఇవ్వాలా? అనేదానిపై కూడా టీమ్మేనేజ్మెంట్కు క్లారిటీ లేదు.
శుభ్మన్ వద్దు..
శ్రేయస్ అయ్యర్ స్థానంలో సూపర్ ఫామ్లో ఉన్న శుభ్మన్ గిల్కు అవకాశం దక్కనన్నట్లు తెలుస్తోంది. అయితే శుభ్మన్ గిల్కు కాకుండా సూర్యకుమార్ యాదవ్ను తుది జట్టులోకి తీసుకోవాలని వెటరన్ వికెట్ కీపర్ దినేశ్ కార్తీక్ అన్నాడు. క్రిక్ బజ్లో జరిగిన ఓ చర్చా కార్యక్రమంలో కార్తీక్ మాట్లాడుతూ... 'నాగ్పూర్ టెస్టులో శ్రేయాస్ అయ్యర్ ఆడకుంటే ఆ స్థానంలో సూర్య - గిల్లో ఎవరిని ఆడించాలనే చర్చ జోరుగా సాగుతోంది. నా అభిప్రాయం మేరకైతే అయ్యర్ ప్లేస్ లో సూర్యకుమార్ యాదవ్ ను ఆడించడమే బెటర్.
సూర్య బెటర్..
ఎందుకంటే సూర్య స్పిన్ బాగా ఆడగలడు. ఇక భారత్- ఆస్ట్రేలియా సిరీస్ లో చర్చ అంతా స్పిన్ చుట్టే తిరుగుతోంది కావున సూర్యను ఆడించడమే బెటర్ అని నా ఫీలింగ్. భారత్ లో స్పిన్ కు సహకరించే పిచ్ లపై సూర్య తప్పక రాణిస్తాడు. అయితే అతడికి ఒక అవకాశమివ్వాలి. టీ20లలో అతడు ఎలా విజృంభిస్తున్నాడనేది చూస్తూనే ఉన్నాం..'అని చెప్పాడు.