ఎంజాయ్ చేయాలనుకుంటే వరల్డ్ టూర్ వెళ్లండి:
తాజాగా అమీర్ సోహైల్ తన యూట్యూబ్ చానెల్లో మాట్లాడుతూ... 'పాకిస్తాన్ ఆటగాళ్లు బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ ఇలా అన్ని విభాగాల్లో విఫలమవుతుంటే.. కోచ్లు చూస్తూ ఊరుకుంటున్నారు. ఆటగాళ్లకు ఎటువంటి సూచనలు చేయడం లేదు. మిస్బా నేతృత్వంలోని కోచింగ్ టీమ్ ఏం చేస్తుంది?. వారిని ఎందుకు కోచ్లుగా నియమించారు. సరదాగా ఇంగ్లండ్ చూడడానికి వెళ్లారా?.. లేక పాక్ ఆటగాళ్లకు సలహాలు, సూచనలు ఇవ్వడానికి వెళ్లారా?. ఎంజాయ్ చేయడానికి వెళ్లాము అనుకుంటే మాత్రం కోచ్లందరూ కలిసి వరల్డ్ టూర్కు వెళ్లండి. మీరు కోచ్లుగా పనిచేయడం వ్యర్థం' అంటూ ఆగ్రహం వ్యక్తం చేశాడు.
యాసిర్ షా మాత్రమే:
'ఈ మ్యాచ్లో యాసిర్ షా మాత్రమే కొద్దిగా మంచి ప్రదర్శన చేశాడు. కానీ అతను మళ్ళీ 150 పరుగులకు పైగా ఇచ్చుకున్నాడు. సుదీర్ఘ స్పెల్ బౌలింగ్ చేసినప్పుడల్లా 150 పరుగులకు పైగా రన్స్ ఇచ్చాడు. వికెట్లు తీయకుండా పరుగులు ఇస్తే.. అవకాశాలు రావడం కష్టం. నసీమ్ షా, షాహీన్ అఫ్రిది కూడా ప్రభావం చూపలేకపోతున్నారు. కోచింగ్ టీమ్ ఏం చేస్తుందో వారికే తెలియాలి' అని సోహైల్ పేర్కొన్నాడు. పాకిస్తాన్ జట్టుకు మిస్బా ఉల్ హక్ ప్రధాన కోచ్గా కొనసాగడంతో పాటు పాక్ జాతీయ చీఫ్ సెలెక్టర్గా కూడా ఉన్నాడు. బౌలింగ్ కోచ్గా వకార్ యూనిస్, ఫీల్డింగ్ కోచ్గా గ్రాంట్ బ్రాడ్బర్న్లు ఉన్నారు.
ఓటమి దిశగా:
ఇంగ్లండ్తో జరుగుతున్న మూడు టెస్టుల సిరీస్లో ఇప్పటికే మొదటి మ్యాచ్ను ఆతిథ్య జట్టుకు సమర్పించుకున్న పాకిస్తాన్.. 0-1 తేడాతో వెనుకబడి ఉంది. వర్షం పుణ్యమాని రెండో టెస్టు మ్యాచ్ డ్రాగా ముగించింది. ఇక కీలకమైన మూడో టెస్టులోనూ నిరాశపరుస్తుంది. మొదట బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ 8వికెట్ల నష్టానికి 583 పరుగుల వద్ద డిక్లెర్ చేసింది. తర్వాత బ్యాటింగ్కు దిగిన పాక్ 273 పరుగులకే ఆలౌట్ అయి ఫాలోఆన్ ఆడుతోంది. ఇప్పటికే రెండు కీలక వికెట్లు కోల్పోయి ఓటమి దిశగా పయనిస్తుంది. ఓపెనర్లు షాన్ మసూద్ (18), అబిద్ అలీ (42)లు పెవిలియన్ చేరారు. కెప్టెన్ అజర్ అలీ (29), బాబర్ అజమ్ (4) క్రీజులో ఉన్నారు. వర్షం కారణంగా చివరి రోజు మ్యాచ్ ఇంకా ప్రారంభం కాలేదు.