ప్రపంచకప్కు ఎంపిక:
నిషేధం ఉండగానే బిగ్ బాష్, ఐపీఎల్ వంటి టోర్నీలో అదరగొట్టడం.. నిషేధం ముగియడంతో ఆసీస్ బోర్డు స్మిత్, వార్నర్లను ప్రపంచకప్కు ఎంపిక చేసింది. దీంతో ప్రపంచకప్ కోసం స్మిత్, వార్నర్లు ఇంగ్లాండ్ వెళ్లారు. శనివారం ఆసీస్, ఇంగ్లాండ్ జట్ల మధ్య వార్మప్ మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్లో బ్యాటింగ్కు దిగిన వార్నర్కు అభిమానుల నుండి చేదు అనుభవం ఎదురైంది.
మైదానం నుంచి వెళ్లిపో:
ఓపెనర్గా వార్నర్ క్రీజులోకి రాగానే అభిమానులు దూషించడం మొదలెట్టారు. 'నువ్వు ఓ మోసగాడివి, మైదానం నుంచి వెళ్లిపో' అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. అయితే వార్నర్ వీటన్నింటిని పట్టించుకోకుండా బ్యాటింగ్ చేశాడు. కొందరు ప్రేక్షకులు వార్నర్ ఫొటోతో పాటు 'చీటర్' అని రాసి ఉన్న టీ షర్టులను ధరించారు. మరికొందరు బంతి ఆకారంలో ఉన్న దుస్తులను ధరించి చేతిలో శాండ్ పేపర్ను పెట్టుకుని స్టేడియానికి వచ్చారు.
55 బంతుల్లో 43 పరుగులు:
అభిమానులు ఎన్ని చేసినా.. అవన్ని పట్టనట్టు వార్నర్ ఉన్నాడు. ఈ మ్యాచ్లో వార్నర్ (55 బంతుల్లో 43; 5 ఫోర్లు) బాధ్యతాయుతంగా ఆడాడు. కష్టాల్లో పడ్డ ఆసీస్ ఇన్నింగ్స్ను షాన్ మార్ష్ (30)తో కలిసి గాడిలో పెట్టాడు. అనంతరం స్మిత్ బ్యాట్ జులిపించడంతో (102 బంతుల్లో 116; 8 ఫోర్లు, 3 సిక్స్లు) .. ఆసీస్ నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 297 పరుగులు చేసింది. లక్ష్య ఛేదనలో ఇంగ్లండ్ 49.3 ఓవర్లలో 285 పరుగులకు ఆలౌటైంది.