For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

IND vs NZ: ఓయ్ రిషభ్ పంత్.. అసలు ఏం అవుదామనుకుంటున్నావ్? హర్షా భోగ్లే ఫైర్!

Harsha Bhogle says “I wonder what kind of player Rishabh Pant wants to be in T20!cricket”

న్యూఢిల్లీ: న్యూజిలాండ్‌తో టీ20 సిరీస్‌లో దారుణంగా విఫలమైన యువ వికెట్ కీపర్ రిషభ్ పంత్‌పై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఓపెనర్‌గా ప్రమోట్ చేస్తూ టీమ్‌మేనేజ్‌మెంట్ ఇచ్చిన రెండు అవకాశాలను రిషభ్ పంత్ వృథా చేసుకున్నాడు. రెండో టీ20లో 13 బంతుల్లో 6 పరుగులు చేసిన పంత్.. మూడో టీ20లోనూ విఫలమయ్యాడు. 5 బంతుల్లో 11 పరుగులు మాత్రమే చేసి నిర్లక్ష్యపు షాట్‌కు వెనుదిరిగాడు. దాంతో రిషభ్ పంత్‌పై మాజీ క్రికెటర్లతో పాటు నెటిజన్లు మండిపడుతున్నారు. అతనికిచ్చిన అవకాశాలు చాలని, పక్కనపెట్టాలని సూచిస్తున్నారు.

టాప్‌లో ఉండాలంటే కష్టపడాలి..

ప్రముఖ కామెంటేటర్ హర్షా భోగ్లే సైతం పంత్ ఔటైన వైఫల్యంపై అసంతృప్తి వ్యక్తం చేశాడు. ఇలానే ఆడితే కెరీర్ కొనసాగడం కష్టమని హెచ్చరించాడు. ఓపెనర్‌గా రిషభ్ పంత్ పాత్రను భోగ్లే ప్రశ్నించాడు. టీ20 క్రికెట్లో.. ముఖ్యంగా ఓపెనర్‌గా పంత్ ఎలాంటి ఆటగాడు కావాలని అనుకుంటున్నాడో తనకు అర్థం కావడం లేదని ట్వీట్ చేశాడు. రిషభ్ టాప్‌లో నిలవాలంటే అతను మరింత శ్రమించి, నైపుణ్యాలను సాధించాలని హర్షా భోగ్లే హితవు పలికాడు. ఈ ట్వీట్ వైలర్‌ కాగా..నెటిజన్లు తమదైన శైలిలో స్పందిస్తున్నారు.

 టీ20లకు పంత్ సెట్టవ్వడు..

టీ20లకు పంత్ సెట్టవ్వడు..

టీ20 ఫార్మాట్‌కు రిషభ్ పంత్ అన్‌ఫిట్ అని తెలిసినా బీసీసీఐ వరుస అవకాశాలు కల్పిస్తుందని ఓ నెటిజన్ విమర్శించాడు. పంత్‌లో టెంపర్‌మెంట్ గానీ.. పవర్ ప్లేలో దూకుడుగా ఆడే తత్వం గానీ లేదన్నాడు. పేస్ కంటే స్పిన్‌ను అతను సమర్థంగా ఎదుర్కోవచ్చని.. బ్రిస్బేన్‌లో అతడి ఇన్నింగ్స్‌ను మర్చిపోలేమని పేర్కొన్నాడు. భారత క్రికెట్ చరిత్రలోనే తీవ్ర అన్యాయానికి గురైన ఆటగాడు సంజూ శాంసనే అని మరో నెటిజన్ కామెంట్ చేశాడు. 2014లోనే అతను భారత జట్టుకు ఎంపికైనప్పటికీ.. మేనేజ్మెంట్ అతని పట్ల వివక్ష చూపుతోందంటూ తీవ్రస్థాయిలో ఆరోపణలు గుప్పించాడు.

సంజూకు చాన్సివ్వాలంటూ..

సంజూకు చాన్సివ్వాలంటూ..

న్యూజిలాండ్‌తో మూడో టీ20లోనూ పంత్ విఫలమయ్యాక.. ట్విట్టర్లో టాప్ ట్రెండింగ్స్‌లో ఒకటిగా అతడి పేరు కనిపించింది. దీన్ని బట్టి పంత్ ఆటతీరు పట్ల నెటిజన్లు ఎంత అసంతృప్తితో ఉన్నారో అర్థం చేసుకోవచ్చు. ఇప్పటికే కొందరు నెటిజన్లు రిటైరై వేరే దేశం తరఫున ఆడాలని సంజూ శాంసన్‌‌కు సూచిస్తున్నారు. రిషభ్ పంత్‌కు ఇచ్చిన అవకాశాలు సంజూ శాంసన్‌కు ఇచ్చి ఉంటే స్టార్ ప్లేయర్‌గా ఎదిగేవాడని అభిప్రాయపడుతున్నారు. కనీసం వన్డే సిరీస్‌లోనైనా పంత్‌ను పక్కనపెట్టి సంజూ శాంసన్‌కు అవకాశం ఇవ్వాలని సూచిస్తున్నారు.

ఇక వన్డే సిరీస్..

ఇక వన్డే సిరీస్..

న్యూజిలాండ్‌తో మంగళవారం జరిగిన చివరి టీ20 వర్షం కారణంగా టై అయ్యింది. దాంతో మూడు మ్యాచ్‌ల సిరీస్‌ను హార్దిక్ సేన 1-0తో కైవసం చేసుకుంది. ఈ సిరీస్‌లో తొలి టీ20 వర్షంతో తుడిచిపెట్టుకుపోగా.. రెండో మ్యాచ్‌లో భారత్ 65 పరుగుల భారీ తేడాతో గెలుపొందింది. చివరి మ్యాచ్‌కు వర్షం అంతరాయం కలిగించగా..డక్‌వర్త్ లూయిస్ ప్రకారం మ్యాచ్ టై అయ్యింది. టీమిండియా శుక్రవారం(నవంబర్ 25) నుంచి శిఖర్ ధావన్ సారథ్యంలో మూడు వన్డేల సిరీస్ ఆడనుంది.

Story first published: Tuesday, November 22, 2022, 21:32 [IST]
Other articles published on Nov 22, 2022
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+