వైద్య సిబ్బందికి భరోసానిద్దాం..
‘స్టేడియం శక్తి మొత్తం అభిమానుల్లో ఉంటే.. భారత దేశ శక్తి ప్రజల్లో ఉంటుంది. ఈరోజు రాత్రి 9 గంటలకు 9 నిమిషాలకు మనమంతా ఏకతాటిపై నిలబడతామని ప్రపంచానికి చాటుదాం. మన వైద్య సిబ్బందికి వెన్నంటే ఉన్నామనే భరోసానిద్దాం. టీమ్ఇండియా రగిలింది మోదీజీ'అని కెప్టెన్ విరాట్ కోహ్లీ ట్వీట్ చేయగా.. ‘కరోనాపై మ్యాచ్ గెలవడం మీదే మన జీవితం ఆధారపడి ఉంది. ఈరోజు రాత్రి 9 గంటలకు 9 నిమిషాల కార్యక్రమంలో పాలుపంచుకొని మీ సంఘీభావాన్ని తెలపండి.'అని రోహిత్శర్మ ట్వీట్ చేశాడు.
కొవ్వొత్తులతో వెలుగులు విరజిమ్ముదాం..
'ఈ చీకట్లో మనకు దారి చూపిస్తూ ముందుండి పోరాడుతున్న ధీరులపైకి.. మనం కొవ్వొత్తులు, ఫ్లాష్లైట్లతో వెలుగులు విరజిమ్ముదాం. భారత ప్రజల బలమైన స్ఫూర్తిని మరోసారి రగిలిద్దాం. మా డ్రెస్సింగ్ రూమ్ నుంచి మీ ఇంటి గుమ్మాల వరకు లక్ష్మణ రేఖలు గీసి ఉన్నాయి. మీవెంటే మేమున్నాం.. నరేంద్రమోదీజీ.' అంటూ టీమిండియా స్టార్ ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా ట్వీట్ చేశాడు.
మనసత్తా చాటుదాం..
‘ఏప్రిల్ 5న 9 గంటలకు 9 నిమిషాలు. కొవ్వొత్తులు, దీపాలతో సిద్ధంగా ఉండండి. మీ ఐక్యత ఎలా ఉంటుందో చూపించండి. 130 కోట్ల మంది హృదయాల స్ఫూర్తిని రగిలించి.. ఈ మహమ్మారిని మన మైదానం నుంచి తరిమేయండి. కలిసికట్టుగా ఈ మహమ్మారిని మనం జయించగలం.' అని ట్విటర్ వేదికగా కేఎల్ రాహుల్ పేర్కొన్నాడు.


Click it and Unblock the Notifications
